ఏపీలో మరో 16 ప్రభుత్వ వైద్య కళాశాలలు

ఏపీలో మరో 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఆళ్లనాని వెల్లడించారు.

Updated : 13 Jul 2020 15:21 IST

మంత్రి ఆళ్ల నాని వెల్లడి

ఏలూరు: ఏపీలో మరో 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఆళ్లనాని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 వైద్యకళాశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో సమాజిక ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ. 75 కోట్లతో బుట్టాయిగూడెంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని