
AP News: బంకులో పెట్రోల్ కొట్టిస్తే.. నీళ్లొచ్చాయి!
బంకులో పెట్రోల్కు బదులు నీళ్లు వస్తున్న దృశ్యం..
నంద్యాల పట్టణం, న్యూస్టుడే: నంద్యాల బొమ్మల సత్రంలోని పెట్రోలు బంకులో పెట్రోలు వేయించుకుంటే నీళ్లు రావడం కలకలం రేపింది. బొమ్మలసత్రానికి చెందిన రామిరెడ్డి టాటా పంచ్ వాహనం కొన్నారు. రూ.1500 విలువ చేసే పెట్రోలును బంకులో నింపుకొని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరుడి క్షేత్రానికి బయలుదేరారు. వంద మీటర్ల లోపే ఆగిపోవడంతో ట్యాంకు మూత తీసి చూడగా నీళ్లు ఉన్నట్లు గమనించి బంకు నిర్వాహకులను నిలదీశారు. రాజమండ్రికి చెందిన మరో వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి మహానందికి వెళ్తూ పెట్రోల్ బంకులో రూ.3,800 విలువ చేసే పెట్రోల్ను తన కారులో పోయించుకున్నారు. అక్కడే నిలిపి పెట్రోలు బంకు వద్దకు వచ్చి విచారణ చేయగా నీళ్లు వస్తున్న విషయం వెల్లడైంది. ఇరువురూ సీసాల్లో పెట్రోలు పోయించి చూడగా నీరు వస్తోందని తెలిసి వాగ్వాదానికి దిగారు. బంకు మేనేజర్తో ఫోన్లో మాట్లాడగా ఇంధనం నింపే సిబ్బంది ఖాదర్, సునీల్కుమార్ నీళ్లు వచ్చిన విషయం వాస్తవమేనని అంగీకరించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేచిచూడాల్సిన పరిస్థితి కల్పించారని బాధితులు వాపోయారు.
నీళ్లతో కలిసి వచ్చిన ఇంధనం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.