
Published : 03 Aug 2020 15:08 IST
సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి రూ.2.28 కోట్లు: కేటీఆర్
సిరిసిల్ల: కరోనా సోకితే దారుణమైన నేరంగా భావించొద్దని తెలంగాణ మంత్రి కె. తారకరామరావు అన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిమిత్తం సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. జిల్లా ఆస్పత్రిలో కొవిడ్ ఐసీయూ వార్డు, 40 పడకల ఆక్సిజన్ వార్డు, కొవిడ్ అంబులెన్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రికి సీఎస్ఆర్ పథకం కింద రూ. 2.28 కోట్ల నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల జిల్లాలోనే రోజుకు వెయ్యి కరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనా బాధితులందరికీ హోంఐసోలేషన్ కిట్లు అందిస్తామని చెప్పారు. బాధితుల సంఖ్య పెరిగితే రెండు పడక గదుల ఇళ్లను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా వాడుకోవాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు.
Tags :