ఇకపై సర్టిఫికెట్లలో పేర్లు మార్చుకోవచ్చు
సీబీఎస్ఈ విద్యార్థులు తమ పాఠశాల సర్టిఫికెట్లలో పేరు మార్పుకోసం అభ్యర్థించవచ్చని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. విద్యార్థుల లేదా వారి తల్లిదండ్రుల పేరు మార్పును అనుమతించని నిబంధనలను సవరించాలని విద్యాశాఖకు సూచించింది.
గుర్తింపు హక్కు భావ ప్రకటనాస్వేచ్ఛలో భాగం: సుప్రీంకోర్టు
నిబంధనల సవరణకు సీబీఎస్ఈకి సూచన
దిల్లీ: సీబీఎస్ఈ విద్యార్థులు తమ పాఠశాల సర్టిఫికెట్లలో పేరు మార్పుకోసం అభ్యర్థించవచ్చని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. విద్యార్థుల లేదా వారి తల్లిదండ్రుల పేరు మార్పును అనుమతించని నిబంధనలను సవరించాలని విద్యాశాఖకు సూచించింది. సీబీఎస్ఈ నిబంధనల చెల్లుబాటుపై పలు హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టులో దాఖలైన అప్పీళ్లపై జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. గుర్తింపు హక్కు భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగమని ధర్మాసనం తెలిపింది. సీబీఎస్ఈ విద్యార్థులు తమ లేదా తమ తల్లిదండ్రుల పేర్లను మార్చుకోవచ్చని పేర్కొంది. పేరు మార్పునకు అనుమతించని సీబీఎస్ఈ నిబంధనలు చట్ట ప్రకారం చెల్లవని చెప్పింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించే అధికారం సీబీఎస్ఈకి లేదని తెలిపింది. పేర్ల మార్పిడి కోసం పాస్పోర్టు, ఆధార్ కార్డు లాంటి ప్రభుత్వం ధ్రువీకరించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని వివరించింది. అయితే వాటిలో పేర్లు.. ఇతర అన్ని అధికారిక రికార్డులకు అనుగుణంగా ఉండాలని సూచించింది. విద్యార్థుల పేర్లు, ఇంటి పేర్లు, తల్లిదండ్రుల పేర్లు సహా ఇతర వివరాలను మార్చుకునేందుకు వీలుగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈకి దిల్లీ హైకోర్టు గతేడాది అక్టోబరులో సూచించింది. అయితే ఓ వ్యక్తి గుర్తింపు వివరాలను ధ్రువీకరించే అధికారం బోర్డుకు లేదని, కేవలం ప్రారంభంలో ఇచ్చిన వివరాలను సర్టిఫికెట్లలో నమోదు చేస్తుందని సీబీఎస్ఈ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు