Telangana News: ఈడీ విచారణకు హాజరుకాని రోహిత్రెడ్డి.. కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్
తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేయడాన్ని తప్పుబడుతూ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో రేపు విచారణ జరగనుంది.
హైదరాబాద్: ఈడీ కేసు విచారణకు తెరాస ఎమ్మెల్యే రోహిత్రెడ్డి హాజరుకాలేదు. ఇవాళ తమ ఎదుట హాజరుకావాలని ఈడీ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టులో నిన్న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ కేసును పూర్తిగా కొట్టివేయాలని పిటిషన్లో కోరారు. ఈనెల 15న పీఎంఎల్ఏ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాగంగానే ఈడీ అధికారులు ఈసీఐఆర్ 48/2022 నమోదు చేసి రోహిత్రెడ్డిని రెండు రోజుల పాటు ప్రశ్నించారు. ఇదే కేసులో అభిషేక్ అనే గుట్కా వ్యాపారికి కూడా నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు. వీరిద్దరితో పాటు నందకుమార్ను కూడా ఈడీ అధికారులు చంచల్గూడ జైల్లో ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో మనీలాండరింగ్ లేకుండానే ఈడీ అక్రమంగా తనపై కేసు నమోదు చేసిందని రోహిత్రెడ్డి నిన్న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.
దీనికి సంబంధించి రోహిత్రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో మీడియా ముఖంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈడీ పరిధి దాటి విచారణ జరుపుతోందని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వేధిస్తున్నారని కూడా రోహిత్రెడ్డి బాహటంగానే చెప్పారు. అయితే, హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్లో ఈడీ అధికారులు నమోదు చేసిన ఈసీఐఆర్ 48/2022ను పూర్తిగా రద్దు చేయాలని, ఎక్కడా మనీలాండరింగ్ జరగకుండానే ఈడీ దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. కేంద్రంతో పాటు ఈడీ, ఈడీ డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు. రేపు రిట్ పిటీషన్ పై విచారణ జరగనున్న దృష్ట్యా... న్యాయవాదులతో సంప్రదించిన తర్వాత వ్యక్తిగతంగా ఈడీ ఎదుట హాజరు కావాలా? వద్దా.. అనేది నిర్ణయం తీసుకుంటానని రోహిత్రెడ్డి తెలిపారు. ఈడీ కేసులకు భయపడనని.. ధైర్యంగా ఎదర్కొంటానని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM