రూ. 10లకే బిర్యానీ.. యజమాని అరెస్టు 

బిర్యానీ రూ.10లకే విక్రయిస్తే అభినందించాల్సి పోయి అరెస్టు చేయటం ఏంటని అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి. తమిళనాడులోని అరుప్పుకొట్టైలో జహీర్‌ అనే వ్యక్తి ఆదివారం బిర్యానీ హోటల్‌ను ప్రారంభించారు. కస్లమర్లు హోటల్‌కు అలవాటు పడేందుకు మొదటి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకూ బిర్యానీని కేవలం

Updated : 20 Oct 2020 15:09 IST

చెన్నై : బిర్యానీ రూ.10లకే విక్రయిస్తే అరెస్టు చేయటం ఏమిటని అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి. తమిళనాడులోని అరుప్పుకొట్టైలో జహీర్‌ అనే వ్యక్తి ఆదివారం ఓ హోటల్‌ను ప్రారంభించాడు. కస్టమర్లు హోటల్‌కు అలవాటు పడేందుకు తొలి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకూ కేవలం రూ.10లకే బిర్యానీని విక్రయిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో జనం బారులుతీరారు. ఫలితంగా తోపులాట ప్రారంభమైంది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ముఖ్యంగా కొవిడ్ నిబంధనలను గాలికొదిలేశారు. భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా నిలబడటం.. చాలా మంది మాస్కులు ధరించకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 

పోలీసులు అక్కడకు చేరుకునేలోపు యజమాని తయారు చేయించిన 2500 బిర్యానీ పొట్లాల్లో దాదాపు సగం వరకూ విక్రయించారు. వారు హోటల్‌ యజమాని జహీర్‌ను అరెస్టు చేశారు. మిగిలిన బిర్యానీ పొట్లాలను యాచకులకు పంపిణీ చేశారు. హోటల్‌ యజమానిపై 188, 269, 278 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదని హెచ్చరించి బెయిల్‌పై విడుదల చేశారు. 

 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని