Konijeti Rosaiah: రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన చంద్రబాబు

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య పార్థివదేహానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయడు నివాళులు అర్పించారు. నగరంలోని బల్కంపేటలో ఉన్న రోశయ్య నివాసానికి వెళ్లిన చంద్రబాబు ..

Updated : 05 Dec 2021 12:45 IST

హైదరాబాద్‌: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య పార్థివదేహానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయడు నివాళులు అర్పించారు. నగరంలోని బల్కంపేటలో ఉన్న రోశయ్య నివాసానికి వెళ్లిన చంద్రబాబు .. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రబాబుతో పాటు తెదేపా నేతలు నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు తదితరులు.. రోశయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రోశయ్య మరణం జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. పదవులకే ఆయన వన్నె తెచ్చారని కొనియాడారు. అందరితో రాజకీయాలకతీతంగా మెలిగారని, రికార్డు స్థాయిలో 16 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారని చంద్రబాబు గుర్తు చేశారు.   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని