Ts News: ఆరోగ్య తెలంగాణను సాకారం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం: హరీశ్రావు
ఆరోగ్య తెలంగాణను సాకారం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. వైద్యారోగ్య శాఖ, ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి హరీశ్రావు
హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణను సాకారం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. వైద్యారోగ్య శాఖ, ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. కొత్త ఆస్పత్రులు, వైద్య కళాశాలల నమూనాలు, వాటి నిర్మాణ పనులపై సమీక్షించారు. వరంగల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టబోతున్నట్లు హరీశ్రావు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో నిర్మాణాలు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. 8 వైద్య కళాశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. త్వరలోనే 4 టిమ్స్ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 20 ఆస్పత్రులకు ప్రత్యేకంగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు హరీష్ రావు తెలిపారు. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం, టిమ్స్, నీలోఫర్ సహా ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
రెండో డోసు తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దు..
రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేయాలని హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్ వేరియంట్, కరోనా పరిస్థితులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘‘వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రెండో డోసుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి. అప్పుడే పూర్తి స్థాయి రక్షణ లభిస్తుంది. రెండో డోసు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపొద్దు. ఇతర వేరియంట్లను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 27 వేల పడకలు ఉన్నాయి. ప్రజలు తమ వంతు బాధ్యతగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, ప్రభుత్వానికి సహకరించాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM