Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ఆ పల్లెల్లో ఓట్ల పండగే
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో గ్రామీణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల ముందు పోటెత్తారు. పలు గ్రామాల్లో 95 శాతానికిపైగా పోలింగ్ జరిగింది. అర్ధరాత్రి 11.30 గంటల వరకు పోలింగ్ జరగడం విశేషం. అయినా ఓటర్లు విసుగు చెందకుండా ఎంతో బాధ్యతతో అర్ధరాత్రి వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉండి ఓటు వేయడం ద్వారా చైతన్యాన్ని చాటారు. పూర్తి కథనం
2. పట్టభద్రులూ.. ఓటు వేయాలి ఇలా..!
నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 27న జరగనుంది. మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. అయితే సాధారణ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటింగ్ విధానంలో తేడాలున్నాయి. చాలా మందికి ఓటు వేసే విధానం తెలియక చేసే పొరపాట్లతో ఓటు చెల్లకుండా పోయే పరిస్థితి ఉంటుంది. పూర్తి కథనం
3. దయచేసి వినండి.. మీ రైలు రద్దయింది!
‘‘విజయవాడ డివిజన్లో నిర్వహణ పనులు (ట్రాఫిక్ బ్లాక్) పేరుతో అధికారులు భారీగా రైళ్లను రద్దు చేస్తుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యాధునిక వ్యవస్థ కలిగిన రైల్వే శాఖ ఏడాదిగా నిర్వహణ పనులు చేపట్టడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. గత కొంతకాలంగా పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తోంది.’’పూర్తి కథనం
4. ఔటర్ చుట్టూ.. ఔరా అనిపించేలా
రాష్ట్రంలో కొత్తగా ఐటీ సంస్థలు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం శరవేగంగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఔటర్ చుట్టూ వాటిని ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వ భూములను సేకరించేందుకు రెవెన్యూ అధికారుల కసరత్తు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఔటర్కు సమీపంలోని కొన్ని ప్రాంతాలు, విమానాశ్రయానికి దగ్గరగా ఉండే మరికొన్ని ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించారు.పూర్తి కథనం
5. చంద్రబాబే ముఖ్యమంత్రి!
తెదేపా అధినేత చంద్రబాబునాయుడే కాబోయే ముఖ్యమంత్రి అని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. మంగళవారం విశాఖ నగరానికి విచ్చేసిన ఆయన సీతమ్మధార కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జూన్ 4వ తేదీన వైకాపా నాయకులు కనబడరని జోస్యం చెప్పారు. దేవుడు అతి తీవ్రంగా కరుణిస్తే ఆ పార్టీకి 50 సీట్లు.. లేకుంటే 25 మాత్రమే వస్తాయని తెలియజేశారు. పూర్తి కథనం
6. అణువణువూ జల్లెడ పట్టాల్సిందే!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్ మొదలు... కుంగడం, సీపేజీలు ఏర్పడటం వరకు సమగ్ర వివరాలను వెంటనే అందజేయాలని సంబంధిత ఇంజినీర్లను నీటిపారుదల శాఖ ఆదేశించింది.పూర్తి కథనం
7. గూగులమ్మ ఇంట ఏఐ పంట
గూగులమ్మ ఇంట ఏఐ పంటటెక్నాలజీ రంగంలో ఎక్కడ చూసినా కృత్రిమ మేధ (ఏఐ) హవానే. గూగుల్ వార్షిక డెవలపర్ సదస్సు ఏ/ఓ 2024 కూడా దీనికే పెద్ద పీట వేసింది. ఇటీవల జరిగిన ఈ సదస్సులో గొప్ప గొప్ప కృత్రిమ మేధ నమూనాలను ప్రదర్శించింది. అభివృద్ధి చేస్తున్న టూల్స్నూ పరిచయం చేసింది. హోంవర్క్లో సాయం చేసే టూల్స్ దగ్గరి నుంచి పదాలతోనే సినిమా స్థాయి వీడియోను రూపొందించే మోడల్ వరకూ ఎన్నెన్నో వీటిలో ఉన్నాయి. పూర్తి కథనం
8. తెదేపాకు ఓట్లేశారు.. మీకు నీళ్లిచ్చేది లేదు
‘మీరు తెదేపా వాళ్లు.. మా ప్రభుత్వ నిధులతో వేసిన డీప్ బోరు నీటిని మీకు ఇచ్చేది లేదు. దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ వైకాపా నాయకులు సరఫరాను నిలిపివేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి కథనం
9. విపక్షాలది మోసగాళ్ల కూటమి
తీవ్రమైన మతతత్వ, కులతత్వ, వారసత్వ రాజకీయాలను వందశాతం చేస్తున్న ‘ఇండియా’ కూటమి మోసగాళ్ల కలయికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై దాడికి దిగారు. రూ.20 లక్షల కోట్ల కుంభకోణాలకు బాధ్యులైన వీరంతా రాజకీయ కూటమిలా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బిహార్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించారు.పూర్తి కథనం
10. మదుపర్ల సంపద@ 5లక్షల కోట్లు
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. బీఎస్ఈలో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మొదటిసారిగా 5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. మంగళవారం ట్రేడింగ్ ముగిసేసరికి మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ రికార్డు గరిష్ఠమైన రూ.414.62 లక్షల కోట్లుగా నమోదైంది.పూర్తి కథనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. -
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్