ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. నా పారితోషికం విషయంలో చాలా జోకులేశారు
నాకౌట్ దశలో తన బౌలింగ్లో ఆడటం చాలా కష్టమని మరోసారి కోల్కతా పేసర్ మిచెల్ స్టార్క్ నిరూపించాడు. తొలి క్వాలిఫయర్లో 3, ఫైనల్ మ్యాచ్లో సన్రైజర్స్పై 2 వికెట్లు తీసి తన సత్తా ఏంటో చూపించాడు. మినీ వేలంలో రూ. 24.75 కోట్లు వెచ్చించడంపై అప్పట్లో కేకేఆర్పై జోకులు పేలాయి. అందుకు తగ్గట్టుగానే లీగ్ స్టేజ్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. పూర్తి కథనం
2.పాపువా న్యూగినీలో 2,000కు చేరిన మృతుల సంఖ్య
పాపువా న్యూగినీ(Papua New Guinea)లో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య భారీగా పెరిగి వేలకు చేరింది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ఐరాసకు వెల్లడించింది. ‘‘కొండచరియలు విరిగి పడిన ఘటనలో 2,000 మంది ప్రజలు సజీవ సమాధి అయ్యారు’’ అని ఆ దేశంలోని నేషనల్ డిజాస్టర్ సెంటర్నుంచి ఐరాస ఆఫీస్కు సమాచారం వెళ్లింది. పూర్తి కథనం
3.జగన్, ఆయన బంధువుల అండతో జవహర్రెడ్డి భూ కుంభకోణం: బొండా ఉమా
ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగినా చర్యల్లేవని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. సీఎస్ జవహర్రెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొండా ఉమా మాట్లాడారు. పూర్తి కథనం
4. ఇండియాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ...వీడియో వైరల్
న్యూయార్క్ (New York)లో ప్రసిద్ధి చెందిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ (replica of the Statue of Liberty) వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీరు ఇలా ఆశ్చర్యపోవడానికి కారణం ఆ విగ్రహం భారత్లో ఉండటమే. పంజాబ్ (Punjab)లోని తరణ్ తారణ్ ప్రాంతంలో ఉన్న ఓ బిల్డింగ్పై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నమూనాను నిర్మిస్తున్న వీడియో సోషల్ మీడియా (social media) లో వైరల్గా మారింది. పూర్తి కథనం
5. రఫాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 35 మంది మృతి
గాజాలోని రఫాలో ఇజ్రాయెల్ (Israel) ఆదివారం జరిపిన దాడుల్లో దాదాపు 35 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. మృతులు, గాయపడిన వారిని తీసుకెళ్లేందుకు రఫాలో సరిపడా సామర్థ్యం ఉన్న ఆసుపత్రులేమీ లేవని పేర్కొంది. పూర్తి కథనం
6. మరో వారం రోజులు బెయిల్ పొడిగించండి..సుప్రీంకు కేజ్రీవాల్ వినతి
ఎన్నికల ప్రచారం నేపథ్యంలో తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను మరో ఏడు రోజులు పొడిగించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సుప్రీం (Supreme court)లో పిటిషన్ వేశారు. ఇటీవల ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్ మంజూరు చేయమని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరడంతో జూన్ 1వరకు సుప్రీం కేజ్రీవాల్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పూర్తి కథనం
7. వేములవాడ రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వేములవాడకు భక్తులు పోటెత్తారు. శ్రీరాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం సోమవారం వేకువజాము నుంచే భారీగా తరలివచ్చారు. తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది భక్తులు చేరుకున్నారు. రాజన్న దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. పూర్తి కథనం
8. సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. కొరియర్ల పేరిట డబ్బులు మాయం!
నేరాలందు సైబర్ నేరాలు వేరయా అన్నట్టుగా ఉంది ఈ రోజుల్లో సైబర్ మోసగాళ్ల వ్యవహారం. రోజుకొక మార్గంలో నేరాలకు పాల్పడుతూ.. బాధితుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఫిషింగ్, అపరిచిత లింక్లు, ఆధార్ స్కామ్లు, ఫెడెక్స్ కొరియర్లంటు నమ్మించి నిలువున ముంచుతున్నారు. పూర్తి కథనం
9. అప్పటి నుంచే తిరుమలకు..
శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ (Janhvi Kapoor) తరచు తిరుమల వెళ్తుంటారు. తన సినిమా విడుదలకు ముందు, పుట్టినరోజునాడు, ప్రత్యేక తేదీల్లోనూ ఆమె తిరుమల స్వామి వారిని దర్శించుకుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తరచూ అక్కడకు వెళ్లడానికి గల కారణాన్ని తెలిపారు. పూర్తి కథనం
10. ఒకే క్యాంపస్లో రెండు యూనివర్సిటీలా..?
సీఎం జగన్ తన తండ్రి పేరుతో సొంత జిల్లాలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పూర్తి కథనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
వంద మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరో రికార్డును సాధించింది. -
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్