Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. రెండు దశాబ్దాల క్రితమే ఈకలు లేని కోళ్ల సృష్టి.. ఎందుకు మార్కెట్లోకి రాలేదంటే!
ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులు చికెన్ను (Chicken) ఇష్టంగా ఆరగిస్తుంటారు. అయితే ఈ కోళ్లు వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక చనిపోతుంటాయి. ఆ సమస్యకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఓ ఇజ్రాయెల్ శాస్త్రవేత్త ఈకలు లేని కోళ్లను సృష్టించాడు. వాటిలోని ప్రత్యేకత ఏంటి? ఆ రకం కోళ్లు ఇంకా ఎందుకు మన మార్కెట్లోకి రాలేదు.. తదితర విషయాల గురించి చదివేయండి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఉత్తర భారత్లో పలుచోట్ల రెడ్అలర్ట్.. దిల్లీలో రికార్డుస్థాయి వర్షపాతం..!
ఉత్తర భారత దేశంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ హిమాచల్ ప్రదేశ్లోని ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్, మూడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు మెరుపు వరదలు, కొండ చరియలు విరిగి పడే ముప్పు ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లలో చిక్కుకుపోయిన ఆరుగురిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. భర్తతో విభేదించి.. ప్లాట్ అమ్మేసి.. ‘పబ్జీ’ ప్రేమలో మలుపులెన్నో!
భారత్- పాకిస్థాన్ సరిహద్దులు దాటిన ‘పబ్జీ’ ప్రేమ కథలో మలుపులెన్నో వెలుగుచూస్తున్నాయి. ఆన్లైన్ గేమ్ ‘పబ్జీ (PUBG)’లో పరిచయమైన వ్యక్తి కోసం.. ఓ పాకిస్థానీ మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి భారత్లో అక్రమంగా ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీసులు వారిని అరెస్టు చేయగా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, అప్పటికే ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు వెల్లడైంది. తననుతాను భారతీయురాలిగానే భావిస్తున్నానని, ఇక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ఆమె పేర్కొనడం గమనార్హం.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. సీఎం నిర్ణయం.. భస్మాసుర హస్తం: అమరావతి రైతులు
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు పునరుద్ఘాటించారు. రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన తమకు సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్5 జోన్ పేరిట ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు. అమరావతి ఉద్యమం 1300 రోజుకు చేరిన నేపథ్యంలో ‘నాలుగేళ్లుగా నరకంలో నవనగరం’ పేరిట కార్యక్రమాలు నిర్వహించారు. మందడంలో నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు, మహిళలు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. 13 ఏళ్ల బాలికకు.. 42 సంవత్సరాల వ్యక్తితో పెళ్లి
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని ఓ తండాలో బాల్య వివాహం జరిగిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు, అధికారులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బాలిక(13)కు, ఫకీరాబాద్కు చెందిన సాహెబ్రావు (42) అనే వ్యక్తితో వివాహం జరిపారు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి సాహెబ్రావు బాలికను తీసుకుని వెళ్లిపోయాడు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. టొరంటోలో ఖలిస్థానీల నిరసన.. ప్రతిగా భారతీయుల ప్రదర్శన..!
కెనడా(Canada)లోని టొరంటో(Toronto) నగరంలో ఖలిస్థానీ మద్దతుదార్లు(Khalistan protests) ఆందోళన చేపట్టగా.. దీనికి దీటుగా భారత జాతీయులు కూడా స్పందించారు. శనివారం భారత కాన్సులేట్ కార్యాలయం ఎదుట ఇరు పక్షాలు పోటాపోటీగా జెండాలను పట్టుకొని ప్రదర్శనకు దిగాయి. తొలుత ఖలిస్థానీలు ఇక్కడకు వచ్చి ఆందోళన చేపట్టగా.. భారత్కు మద్దతుగా కూడా ప్రదర్శనలు మొదలయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి జగన్ భూమి పూజ
వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక స్థలం జమ్మలమడుగు మండలం గండికోటలో ఒబెరాయ్ హొటల్ నిర్మాణ పనులకు సీఎం జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. విశాఖ, తిరుపతిలో నిర్మించనున్న ఒబెరాయ్ హోటల్స్కి కూడా వర్చువల్గా సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఒబెరాయ్ హొటల్స్ ఎండీ, సీఈవో విక్రమ్ ఒబెరాయ్ పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. 4 డాలర్లకు పడిపోనున్న రష్యా చమురు డిస్కౌంట్..!
రష్యా(Russia) నుంచి చౌకగా భారత్(India)కు లభిస్తున్న చమురు ధరల్లో మార్పులు రానున్నాయి. డిస్కౌంట్ 4 డాలర్లకు తగ్గిపోనున్నట్లు సమాచారం. మరోవైపు రష్యా ఏర్పాటు చేసిన చమురు రవాణా సంస్థల చార్జీలు మాత్రం ఇప్పటికీ అధికంగానే ఉన్నాయి. దీంతో దేశీయంగా చమురు ధరలపై ప్రతికూల ప్రభావం పడనుంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఉత్తరాఖండ్లో నదిలో పడిన వాహనం.. తెలుగు వ్యక్తి గల్లంతు
ఉత్తరాఖండ్లోని తెహ్రి జిల్లా గులార్ వద్ద నదిలో పర్యాటకుల వాహనం బోల్తా పడింది. వర్షాల కారణంగా విరిగిపడిన కొండచరియలను తప్పించబోయి నదిలోకి దూసుకెళ్లింది. వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఐదుగురిని విపత్తు నిర్వహణ బృందం రక్షించింది. గల్లంతైన మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. బాధితుల్లో విజయనగరం జిల్లాకు చెందిన దంపతులు ఉన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. టీమ్ఇండియా వెస్టిండీస్ టూర్.. మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ ఇదే
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత దాదాపు నెలరోజులపాటు విశ్రాంతి తీసుకున్న టీమ్ఇండియా (Team India) క్రికెటర్లు త్వరలో తిరిగి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడనున్నారు. ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్ (West Indies)పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కరేబియన్ జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. టీ20 సిరీస్లో చివరి రెండు మ్యాచ్లు అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించనున్నారు. మిగతా అన్ని మ్యాచ్లు విండీస్లోనే జరగనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు