Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. రాజకీయ కారణాలతో టీచర్ను చంపడం దారుణం: చంద్రబాబు
విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్యను తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కారణాలతో ఒక టీచర్ను చంపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలకు ప్రభుత్వ పెద్దలు, అధికారుల ఉదాసీన వైఖరే కారణమని ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. పవన్ వ్యాఖ్యలపై ఆర్జీవీ ట్వీట్.. పోలీసులకు ఫిర్యాదు
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ(ఆర్జీవీ)పై సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు గంగాధర్ మంగళగిరి గ్రామీణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాలంటీర్లను ఉద్దేశిస్తూ జనసేన అధినేత పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆర్జీవీ చేసిన ట్వీట్పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ట్వీట్ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. శ్రీవాణి ట్రస్టుపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తితిదే ఈవో
శ్రీవాణి ట్రస్టుపై కొందరు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘‘ శ్రీవాణి ట్రస్టుపై మరో ఆరోపణ వచ్చింది. కావాల్సిన వారికి ఆలయాలు నిర్మాణ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. జీర్ణోద్ధరణలో భాగంగానే పార్వేట మండపం నిర్మాణం జరుగుతుంది. పార్వేట మండపాన్ని కూల్చివేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. పీవీ ఎక్స్ప్రెస్ వేపై కారు బీభత్సం
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో పీవీ ఎక్స్ప్రెస్వేపై కారు బీభత్సం సృష్టించింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి అతివేగంతో మెహిదీపట్నం వెళ్తుండగా బోల్తాపడింది. ప్రమాదతీవ్రతకు ఎయిర్పోర్టు వైపునకు వెళ్తున్న మూడు కార్లు ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వెంకటేశ్, విజయ్ సేతు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. సౌత్ జోన్దే దులీప్ ట్రోఫీ
దేశీయ క్రికెట్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీని (Duleep Trophy) సౌత్ జోన్ కైవసం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన వెస్ట్జోన్పై 75 పరుగుల తేడాతో సౌత్ జోన్ విజయం సాధించింది. సౌత్జోన్ కెప్టెన్ హనుమ విహారి జట్టును ముందుండి నడిపించాడు. సౌత్జోన్ నిర్దేశించిన 298 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్ట్జోన్ 222 పరుగులకే ఆలౌటైంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. కల్వరీ జలాంతర్గాముల డీల్ తొలగింపు..!
ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో కుదిరిన మూడు అదనపు జలాంతర్గాముల డీల్.. తాజాగా ఇరు దేశాల సంయుక్త ప్రకటన నుంచి అదృశ్యమైంది. ఈ ప్రకటన కాపీ విదేశీ వ్యవహారాల శాఖ వెబ్సైట్లో కూడా అప్లోడ్ అయ్యింది. కానీ, ఆ తర్వాత దీనికి సంబంధించిన రివైజ్డ్ కాపీని ఆ శాఖ వెబ్సైట్లో ఉంచారు. దీని నుంచి కల్వరీ శ్రేణి అదనపు జలాంతర్గాముల నిర్మాణ ఒప్పందం అంశాన్ని తొలగించడం గమనార్హం.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. కాంవడ్ యాత్రలో విషాదం.. ఐదుగురి మృతి
ఉత్తర్ప్రదేశ్(Uttar Pradesh)లో విషాదం చోటుచేసుకుంది. కాంవడ్ యాత్ర(Kanwariya Pilgrims) చేపట్టిన యాత్రికుల వాహనానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలాయి. ఈ ప్రమాదంలో విద్యుదాఘాతానికి గురై ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన మేరఠ్ జిల్లాలో చోటుచేసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. భార్య మృతదేహాన్ని తరలిస్తుండగా భర్త మృతి
మంచిర్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుంది. పక్కింటి వాళ్ల గొడవతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తరలిస్తుండగా.. భర్త లారీ కింద పడి మృతి చెందారు. జిల్లాలోని లక్సెట్టిపేట మండలంలోని ఎల్లారంలో ఈ ఘటన జరిగింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. డ్రైవర్ను చితకబాది.. బియ్యం లారీతో ఉడాయించిన దుండగులు
విశాఖ నగర పరిధిలో బియ్యం లారీని దుండగులు ఎత్తుకెళ్లారు. డ్రైవర్ను చితకబాది లోడుతో ఉన్న లారీని తీసుకెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ ఎయిర్పోర్టు దాటిన తర్వాత గాజువాక వైపు వెళ్తున్న బియ్యం లారీని ముగ్గురు దుండగులు ఆపారు. అనంతరం డ్రైవర్ను చితకబాది అతడి వద్ద ఉన్న కొంత నగదు, లారీతో ఉడాయించారు. డ్రైవర్ ఫిర్యాదుతో కంచరపాలెం పోలీసుల కేసు నమోదు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. అమరావతి రైతుల కన్నీటి కడలిలో వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోతుంది: దేవినేని
రాజధాని ప్రాంతంలోని మందడంలో రైతులు సుదర్శన యాగం నిర్వహించారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ప్రార్థిస్తూ యాగం చేపట్టారు. రేపు ఆర్-5 జోన్పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అమరావతికి మద్దతుగా తీర్పు రావాలని ప్రార్థించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు