Hyderabad: పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై కారు బీభత్సం

హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బీభత్సం సృష్టించింది.

Published : 16 Jul 2023 12:17 IST

రాజేంద్రనగర్‌: హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బీభత్సం సృష్టించింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి అతివేగంతో మెహిదీపట్నం వెళ్తుండగా బోల్తాపడింది. ప్రమాదతీవ్రతకు ఎయిర్‌పోర్టు వైపునకు వెళ్తున్న మూడు కార్లు ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వెంకటేశ్‌, విజయ్‌ సేతు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. రోడ్డుపై ఆయిల్‌ పడటంతో వాహనాలు జారిపడిపోకుండా రాజేంద్రనగర్‌ పోలీసులు మట్టి పోశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని