Vizag: డ్రైవర్‌ను చితకబాది.. బియ్యం లారీతో ఉడాయించిన దుండగులు

విశాఖ నగర పరిధిలో బియ్యం లారీని దుండగులు ఎత్తుకెళ్లారు. డ్రైవర్‌ను చితకబాది లోడుతో ఉన్న లారీని తీసుకెళ్లిపోయారు.

Updated : 16 Jul 2023 11:52 IST

మాధవధార: విశాఖ నగర పరిధిలో బియ్యం లారీని దుండగులు ఎత్తుకెళ్లారు. డ్రైవర్‌ను చితకబాది లోడుతో ఉన్న లారీని తీసుకెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ ఎయిర్‌పోర్టు దాటిన తర్వాత గాజువాక వైపు వెళ్తున్న బియ్యం లారీని ముగ్గురు దుండగులు ఆపారు. అనంతరం డ్రైవర్‌ను చితకబాది అతడి వద్ద ఉన్న కొంత నగదు, లారీతో ఉడాయించారు. డ్రైవర్‌ ఫిర్యాదుతో కంచరపాలెం పోలీసుల కేసు నమోదు చేశారు. సీఐ కాంతారావు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని