Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో గుడ్న్యూస్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. విభాగాల వారీగా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే అలవెన్స్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రావెలింగ్ అండ్ కన్వీయన్స్, సెలవు రోజుల్లో ఉద్యోగులకు, ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే అడ్వాన్స్.. ఇలా పలు రకాల అలవెన్స్లను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి.. తితిదే కీలక నిర్ణయాలు
అలిపిరి నడక మార్గంలో ఏడోమైలు వద్ద బాలుడిపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో తితిదే కీలక నిర్ణయాలు తీసుకుంది. చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని శుక్రవారం తితిదే ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాడి చేసింది పిల్ల చిరుత కావడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పిందన్నారు. దాడి జరిగిన సమయంలో భక్తులు పెద్దగా అరవడం, రిపీటర్ స్టేషన్ నుంచి లైట్లు వేయడంతో చిరుత బాలుడిని వదిలేసి వెళ్లి పోయిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. 9ఏళ్లుగా కేంద్రాన్ని కోరుతూనే ఉన్నాం.. ఇప్పటికీ ఒప్పుకోలేదు: కేటీఆర్
తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పోతే 40పైసలే తిరిగి వస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎదుగుతున్న రాష్ట్రానికి సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేంద్రమే చెబుతోంది. సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ భూముల గురించి కేంద్రానికి ఎన్నోసార్లు కోరామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. అదంతా ఓ ఫొటో సెషన్.. విపక్షాల భేటీపై అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు
బిహార్(Bihar) రాజధాని పట్నాలో శుక్రవారం జరుగుతోన్న విపక్షాల భేటీ(Opposition meet)పై భాజపా(BJP) నేతలు విమర్శలు గుప్పించారు. అదొక ఫొటో సెషన్ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. ‘ఈ రోజు పట్నాలో ఫొటో సెషన్ జరుగుతోంది. వారు ప్రధాని మోదీ, ఎన్డీఏను సవాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. 2024లో కూడా మోదీనే ప్రధాని అవుతారు’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. రాజకీయాల్లో నేడు విచిత్రాలు జరుగుతున్నాయి.. జేపీ నడ్డా
బిహార్ రాజధాని పట్నాలో విపక్ష పార్టీలు భేటీ(opposition meeting) కావడంపై భాజపా(BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) స్పందించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో జైలుకు వెళ్లిన నేతలే ఇప్పుడు ఆమె మనవడు రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి ఆహ్వానం పలుకుతున్నారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. అలా అయితేనే స్వయం సమృద్ధి భారత్ సాధ్యం: గడ్కరీ
సామాజిక ఆర్థిక అసమానతలకు స్వస్తి చెబితేనే ‘స్వయం సమృద్ధి భారత్ (Atmanirbhar Bharat)’ సాధ్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. వ్యవసాయ, గ్రామీణ, గిరిజన రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని తెలిపారు. జీడీపీలో వీటి వాటా ప్రస్తుతం ఉన్నదానితో పోలిస్తే రెట్టింపు కావాల్సిన అవసరం ఉందన్నారు. 2020లో కేంద్ర ప్రభుత్వం ‘స్వయం సమృద్ధి భారత్’ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. 2050 నాటికి 130 కోట్ల మందికి డయాబెటిస్!
మధుమేహంతో బాధపడుతున్న వారికి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి రెట్టింపు అవుతుందని పరిశోధకులు తెలిపారు. ఫలితంగా లక్షలాది మందికి ప్రమాదకర రుగ్మతల ముప్పు పెరగనుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2021లో 52.9 కోట్ల మంది డయాబెటిస్ (Diabetes) బాధితులు ఉన్నారని లాన్సెట్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన కథనంలో పరిశోధకులు తెలిపారు. ఈ సంఖ్య 2050 నాటికి 130 కోట్లు దాటుతుందని అంచనా వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. విమానంలో ‘హైజాకింగ్’ మాట కలకలం.. ప్రయాణికుడి అరెస్టు!
విమానం బయల్దేరే సమయంలో ఓ వ్యక్తి మాట్లాడిన మాటలు కలకలం సృష్టించాయి. హైజాకింగ్ (Hijacking) అంటూ అతడు ఫోన్లో మాట్లాడటం.. సిబ్బందిని పరుగులు పెట్టించింది. వెంటనే భద్రతాబలగాలు రంగంలోకి దిగి అతడిని అదుపులోకి తీసుకున్నాయి. అధికారుల వివరాల ప్రకారం.. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం (Mumbai Airport) నుంచి గురువారం రాత్రి దిల్లీకి ఓ విస్తారా (Vistara) విమానం బయల్దేరేందుకు సిద్ధమైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. టైటాన్ ప్రయాణం.. విషాదాంతమైందిలా!
టానిక్ (Titanic) శిథిలాల సందర్శనకు కొందరు ఔత్సాహికులు చేసిన సాహసం విషాదాంతమైంది. కొన్ని గంటల్లోనే తిరిగి వస్తామని భావించిన ఆ ప్రయాణికుల కల చెదిరిపోయింది. వేల అడుగుల లోతులోకి వెళ్లిన ఐదుగురు సాహసప్రియులు.. జలాంతర్గామి విచ్ఛిన్నం కావడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. క్యాన్సర్ నిర్ధారణ.. తోటలో కుమార్తెతో సహా దంపతుల ఆత్మహత్య
అనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు.. కుమార్తెతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తకారాయగూడేనికి చెందిన పోట్రు కృష్ణయ్య (40), సుహాసిని (35)లకు అమృత (19) అనే కుమార్తె ఉంది. సుహాసినికి నెలన్నర క్రితం కృష్ణా జిల్లా తిరువూరులో గర్భసంచికి శస్త్రచికిత్స చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత