Anand Mahindra: వైట్హౌస్లో స్టేట్ డిన్నర్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారు?
వైట్హౌస్లో ఏర్పాటు చేసిన స్టేట్ డిన్నర్కు సంబంధించిన వీడియోలను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్లో పోస్టు చేశారు.
దిల్లీ: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మహీంద్రా గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఆసక్తికరమైన ఏ విషయం తన దృష్టికి వచ్చినా అందరితోనూ పంచుకుంటారు. ఆయన ఏదైనా అంశాన్ని పోస్టు చేశారంటే... అందులో కచ్చితంగా ఏదో కొత్తదనం ఉంటుందనడంలో సందేహం లేదు. తాజాగా ప్రధాని మోదీ అమెరికా పర్యటనను పురస్కరించుకొని, ఆయన గౌరవార్థం వైట్హౌస్లో (White House) స్టేట్ డిన్నర్ను (State dinner) ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్కు దాదాపు 400 మంది ప్రముఖులు హాజరయ్యారు. అందులో ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు. తాజాగా డిన్నర్ ఏర్పాట్లు, అక్కడి ఆతిథ్యం ఎలా ఉంటుందో తెలియజెప్పేలా ఆయన కొన్ని వీడియోలను ట్విటర్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
‘‘ ప్రధాని మోదీ గౌరవార్థం వాషింగ్టన్లో స్టేట్ డిన్నర్కు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు పంచుకుంటానని మాటిచ్చాను. డిన్నర్లో వడ్డించిన వంటకాల విషయం పక్కన పెడితే.. అక్కడి సంగీత ప్రదర్శన చూసి ఆశ్చర్యపోయాను.’’ అంటూ ఆయన రాసుకొచ్చారు. అతిథుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్లో ప్రముఖ వయోలినిస్ట్ జోషువా బెల్, దక్షిణ ఆసియాకు చెందిన పెన్ మసాలా గ్రూప్, యూఎస్ మెరైన్బాండ్ ఆర్కెస్ట్రా తమ గీతాలతో అలరించారు. వైట్హౌస్ లాన్లో భారత జాతీయ జెండాలోని త్రివర్ణ రంగులను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్పై ఆకుపచ్చ కాషాయ రంగుల్లో పుష్పాలను భారత జాతీయ పుష్పం కమలాన్ని ఏర్పాటు చేశారు. ఇరు దేశాల జాతీయ పక్షులైన గ్రద్ధ, నెమలి చిత్రాలను ప్రదర్శించారు.
వైట్హౌస్లో ఏర్పాటు చేసిన విందుకు పారిశ్రామిక వేత్తలు, బిలియనీర్లు, టెక్ దిగ్గజాలు, ఫ్యాషన్ ఐకాన్లు హాజరయ్యారు. అధ్యక్షుడు జోబైడెన్, ప్రథమ మహిళ జిల్ దాదాపు 400 మంది అతిథులను ఈ విందుకు ఆహ్వానించారు. ఈ విందులో భారత బిలియనీర్ ముఖేశ్ అంబానీ, యాపిల్ సీఈవో టిమ్ కుక్, కార్పొరేట్ దిగ్గజం ఇంద్రానూయి, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ హాజరయ్యారు. అలాగే మానవహక్కుల ఉద్యమకర్త మార్టిన్ లూథర్ కింగ్-3, టెన్నిస్ ఆటగాడు బిల్లీ జేన్ కింగ్, సినీ ప్రముఖుడు నైట్ శ్యామలన్, ఫ్యాషన్ డిజైనర్ రాల్ఫ్ లౌరెన్, వ్యాపారవేత్త ఫ్రాంక్ ఇస్లామ్, గ్రామీ అవార్డు గ్రహీత జాషువా బెల్ పాల్గొన్నారు. ఇక ఇండో-అమెరికన్ చట్టసభ సభ్యులు, రోఖన్నా, ప్రమీలా జయపాల్, బైడెన్ కుటుంబ సభ్యులు హంటర్, యాష్లే, జేమ్స్, నవోమీ బైడెన్ కూడా విందుకు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.