TS Govt: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో గుడ్‌న్యూస్‌

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.

Updated : 23 Jun 2023 17:30 IST
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. విభాగాల వారీగా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే అలవెన్స్‌ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రావెలింగ్‌ అండ్‌ కన్వీయన్స్‌, సెలవు రోజుల్లో ఉద్యోగులకు, ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే అడ్వాన్స్‌.. ఇలా పలు రకాల అలవెన్స్‌లను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

జీవో ప్రకారం ఉద్యోగులకు పెరిగేవి ఇవే..

  • ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ - 30శాతం.
  • బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్స్ - 30శాతం.
  • సెలవురోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లకు అదనంగా రూ. 150 చెల్లింపు.
  • షెడ్యూల్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్‌ కాంపన్సేటరీ అలవెన్స్‌ - 30శాతం.
  • దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీనియన్స్ అలవెన్స్ రూ. 2000 నుంచి రూ. 3000కు పెంపు.
  • ఇళ్లు నిర్మించుకునే ఉద్యోగులకు ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ. 20 లక్షల నుంచి రూ. 30లక్షలకు పెంచుతూ నిర్ణయం.
  • కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ. 6 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంపు.
  • మోటార్ సైకిల్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ రూ.80వేల నుంచి రూ. 1 లక్షకు పెంచుతూ నిర్ణయం.
  • ఉద్యోగుల పిల్లల వివాహాలకు సంబంధించి.. కుమార్తె పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ. 1లక్ష నుంచి రూ. 4 లక్షలకు పెంపు.
  • కుమారుడి పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ. 75వేల నుంచి రూ. 3 లక్షలకు పెరిగింది.
  • స్టేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్ - 30శాతం.
  • గ్రేహౌండ్స్, ఇంటిలిజెన్స్, ట్రాఫిక్, సీఐడీ, ఆక్టోపస్, యాంటీ నక్సలైట్ స్క్వాడ్ విభాగాల్లో పని చేసే పోలీసులకు ఇచ్చే స్పెషల్ పేను 2020 పే స్కేల్ ప్రకారం వర్తింపజేయాలని నిర్ణయం.
  • పెన్షనర్లు మరణిస్తే అందించే తక్షణ సాయం రూ. 20 వేల నుంచి రూ. 30వేలకు పెంపు.
  • ప్రొటోకాల్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తించే అన్ని విభాగాల్లోని ఉద్యోగులకు అదనంగా 15శాతం స్పెషల్ పే.

కొద్దిరోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం 2.73 శాతం డీఏ ప్రకటించింది. తాజాగా మరింత ప్రయోజనం కల్పించేలా ఆదేశాలు జారీ చేయడంపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని