Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తల
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. మంత్రి వేణుపై పిల్లి సుభాష్ కీలక వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం టికెట్పై వైకాపా సీనియర్ నేత, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని స్పష్టం చేశారు. మమ్మల్ని.. వేణు చెప్పు కింద బతికే వాళ్లం అనుకుంటున్నారా?అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మైనారిటీలకు రూ.లక్ష ఆర్థికసాయం.. ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందివ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారదోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. బైజూస్ కాంట్రాక్టుపై పవన్ ప్రశ్నల వర్షం
నష్టాల్లో ఉన్న బైజూస్ కంపెనీకి రూ.కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని ట్విటర్ వేదికగా నిన్న ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇవాళ మరికొన్ని ప్రశ్నలు సంధించారు. ‘‘బైజూస్ కంటెంట్ కోసం వచ్చే ఏడాది నుంచి ఖర్చు ఎవరు భరిస్తారు? కంపెనీ వారు ప్రతి ఏడాది ఉచితంగా ఇస్తారా? ఈ విషయంలో క్లారిటీ లోపించింది’’ అని ట్వీట్ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. మరో మూడు రోజులు భారీ వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ రెండు రోజులు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. టీఆర్టీ ఇవ్వకుంటే ప్రగతిభవన్ను ముట్టడిద్దాం: ఎంపీ కోమటిరెడ్డి
ఓట్ల కోసం పథకాల పేరుతో ప్రజలను మోసం చేసే సీఎం కేసీఆర్కు నిరుద్యోగుల బాధలు పట్టవా?అని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (KomatiReddy VenkatReddy) ప్రశ్నించారు. ఎంపీ కోమటిరెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ) అభ్యర్థులు కలిశారు. ఏళ్లు గడుస్తున్నా టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడం లేదని ఎంపీకి వివరించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. మద్యం మత్తులో బార్కు నిప్పు.. 11 మంది మృతి
మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన పని 11 మంది ప్రాణాలను బలిగొంది. మెక్సికోలోని సోనోరా (Sonora) రాష్ట్రంలోని శాన్ లూయిస్ రియో కొలరాడో (San Luis Rio Colorado) నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్కు వెళ్లిన ఓ వ్యక్తి పీకలదాకా మద్యం తాగాడు. అనంతరం బార్లోని మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో.. బార్ భద్రతా సిబ్బంది అతన్ని బయటకు పంపించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ట్రయల్స్లో ఒలింపియన్ రవి దహియాకు షాక్..!
ఒలింపిక్ రజత పతక విజేత రవి దహియకు భారీ షాక్ తగిలింది. ఆసియా క్రీడల కోసం నిర్వహించిన ఎంపికల్లో ఓటమి పాలయ్యాడు. యవ రెజ్లర్ అతిష్ తోడ్కర్ అతడిని ఓడించాడు. ఇందిరాగాంధీ స్టేడియంలో 57 కేజీల విభాగంలో ఆదివారం ఉదయం జరిగిన బౌట్లో తోడ్కర్ విజయం అందుకొన్నాడు. టెక్నిక్, శక్తిలో దహియాను రెజ్లింగ్ సర్కిల్స్ ఓ యంత్రంగా అభివర్ణిస్తారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. చాక్లెట్ల దొంగకు 18 నెలల జైలు శిక్ష
చాక్లెట్లు దొంగతనం చేసినందుకు ఓ వ్యక్తికి న్యాయస్థానం 18 నెలల జైలుశిక్ష విధించింది. అదేంటి ఆమాత్రం దానికి అంత పెద్దశిక్ష ఏంటి అనుకుంటున్నారా? ఆ వ్యక్తి దొంగిలించినవి ఒకట్రెండు కాదు.. ఏకంగా 2 లక్షల చాక్లెట్లు వాటి విలువ దాదాపు రూ.42 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ఘటన బ్రిటన్లో జరిగింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. నియంత్రణ లేకుంటే.. యూఎస్ నుంచే కొవిడ్ తరహా మహమ్మారి!
చైనాలో పుట్టినట్లు భావిస్తోన్న కొవిడ్-19 మహమ్మారి (Covid Pandemic) యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన విషయం తెలిసిందే. దీన్నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నప్పటికీ.. మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఆకాశంలో తొలి పుట్టినరోజు..
తన మొదటి పుట్టిన రోజున విమానంలో ప్రయాణిస్తున్న చిన్నారికి ఇండిగో (Indigo Airlines) విమానయాన సంస్థ సర్ప్రైజ్ ఇచ్చింది. విమానంలోనే ఆ చిన్నారి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించింది. దాంతో ప్రయాణికులంతా చప్పట్లతో బేబీకి శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియోను చిన్నారి తండ్రి జోయెల్ లాల్ ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా.. అది వైరల్గా మారింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు