Pandemic: నియంత్రణ లేకుంటే.. యూఎస్ నుంచే కొవిడ్ తరహా మహమ్మారి!
కరోనా తరహా తదుపరి మహమ్మారి అమెరికా మాంసం సరఫరా నుంచే వ్యాపించవచ్చని తాజా అధ్యయనం హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: చైనాలో పుట్టినట్లు భావిస్తోన్న కొవిడ్-19 మహమ్మారి (Covid Pandemic) యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన విషయం తెలిసిందే. దీన్నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నప్పటికీ.. మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా తరహా తదుపరి మహమ్మారి అమెరికా మాంసం సరఫరా నుంచే వ్యాపించవచ్చని తాజా అధ్యయనం హెచ్చరించింది. ‘అమెరికాలో జంతు మార్కెట్లు, జంతుకారక వ్యాధులు’ పేరుతో హార్వర్డ్ లా స్కూల్, న్యూయార్క్ యూనివర్సిటీలు చేపట్టిన తాజా అధ్యయన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది.
జంతువుల నుంచి మానవులకు సంక్రమించే (జంతుకారణ) వ్యాధులనే జూనోటిక్ వ్యాధులంటారు. గాలి, నీరు, ఆహారం, వస్తువుల ద్వారా కూడా ఇవి సంక్రమిస్తాయి. ఎబోలా, జికాతో పాటు ఇతర ప్రాణాంతక వ్యాధులు ఎక్కువగా ఇలాగే వ్యాపించాయి. ఈ క్రమంలోనే అమెరికాలో జంతువుల నుంచి మానవులకు సాంక్రమిక వైరస్లు తేలికగా వ్యాప్తిచెందే అవకాశం ఉందని.. ఇవే మహమ్మారి తరహాలో వ్యాప్తికి దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. జంతువులకు అత్యంత సన్నిహితంగా మెలిగే ఫార్మ్లు, వాటి చర్మ వాణిజ్యం వంటివి వ్యాధి వ్యాప్తికి ఆస్కారం ఉన్న ప్రాంతాలని తాజా అధ్యయనంలో ఒకరైన యాన్ లిండర్ అనే పరిశోధకురాలు పేర్కొన్నారు. వివిధ అవసరాల కోసం ఏటా 22కోట్ల జంతువులు అమెరికాలోకి దిగుమతి అవుతున్నాయని.. వివిధ ఖండాల్లోని జంతువులను, వ్యాధికారకాలను కలుపుతూ అత్యంత వేగంగా వాటిని వ్యాప్తి చేస్తున్నామని అన్నారు.
ఎగుమతి నిషేధం.. అమెరికాలో గం‘ధర’గోళం
సీడీసీ ప్రకారం, అమెరికాలో బర్డ్ ఫ్లూ మానవులకు సంక్రమించడమనేది అత్యంత అరుదు అని నేషనల్ చికెన్ కౌన్సిల్కు చెందిన ఆష్లే పీటెర్సన్ వెల్లడించారు. అయితే, పంది, పౌల్ట్రీ ఫారాల్లో పనిచేసే కార్మికులకు వీటి నుంచి ముప్పు ఎక్కువగా ఉందని మరో నిపుణుడు డెల్సియన్నా విండెర్స్ స్పష్టం చేశారు. ఇటువంటి సమయంలో కోళ్లు, పంది ఫారాలతో పాటు కబేళాలపై నియంత్రణ పెంచాల్సింది ఉండగా.. అమెరికా ప్రభుత్వం మాత్రం నియంత్రణను తగ్గిస్తోందని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం మార్గమధ్యలో తీవ్ర కుదుపులకు లోనుకావడంతో దాన్ని థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లోని విమానాశ్రయానికి మళ్లించారు. -
అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికా-రష్యా మాటల యుద్ధం
అంతరిక్షంలో ఆయుధాల నిరోధక అంశానికి సంబంధించి అమెరికా, రష్యా దేశాలు ఐరాసలో తీర్మానాలు ప్రవేశపెట్టాయి. -
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ అభ్యర్థన వెనక స్టార్ హీరో సతీమణి
ఇజ్రాయెల్ ప్రధాని సహా హమాస్ నేతలు యహ్యా సిన్వర్, మహమ్మద్ డెయిఫ్, ఇస్మాయిల్ హనియాపైనా అరెస్టు వారెంట్ జారీ చేయాలంటూ ఐసీసీలో పిటిషన్ దాఖలైంది. దీని వెనక ఒక స్టార్ హీరో సతీమణి ఉన్నారు. -
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు సిగ్నల్ వ్యవస్థే లేదా..?
ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన హెలికాప్టర్లో సిగ్నల్ వ్యవస్థ కూడా లేకపోయి ఉండొచ్చని తుర్కియే అనుమానం వ్యక్తం చేసింది. -
విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి
ఓ విమానం భారీగా కుదుపులకు లోనైన ఘటనలో ఒకరు మృతి చెందాడు. -
చైనా ఆక్రమిస్తే.. కిల్ స్విచ్ ఆన్ అవుతుంది: సెమీకండెక్టర్ తయారీ సంస్థల ప్లాన్..!
చైనాకు షాకిచ్చే ఓ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. బీజింగ్ ఏమాత్రం తైవాన్ మీదకు కాలు దువ్వినా.. చిప్ తయారీ యంత్రాలు వాటంతట అవే నిలిచిపోయేలా ఏర్పాట్లు చేశారు. -
యూరప్ ట్రిప్ మరింత భారం.. షెంజెన్ వీసా ఫీజు పెంపు
Schengen Visa: షెంజెన్ వీసా ఫీజును 12శాతం పెంచేందుకు యూరోపియన్ కమిషన్ ఆమోదం తెలిపింది. వచ్చే నెల నుంచే ఇది అమల్లోకి రానుంది. -
మళ్లీ మరచిపోయిన బైడెన్.. ఈసారి ‘వైస్ ప్రెసిడెంట్’
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి గందరగోళానికి గురయ్యారు. కరోనా కాలంలోని పరిస్థితులను ప్రస్తావిస్తూ ఆ టైంలో తాను ఉపాధ్యక్షుడిగా పనిచేశానంటూ మాట తుళ్లారు. -
బోర్గ్ డ్రింకింగ్.. అమెరికా యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్!
BORG Drinking: బోర్గ్ డ్రింకింగ్ అనే ట్రెండ్ అమెరికా కాలేజ్ క్యాంపస్లలో కనిపిస్తోంది. ఇంతకీ ఏంటిది? ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయో చూద్దాం..! -
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై విభిన్న ప్రచారాలు జరుగుతున్నాయి. అంతరిక్ష లేజర్లు.. వారసత్వ పోరు కారణంగానే ఆయన ప్రాణాలు కోల్పోయారని వీటిల్లో పేర్కొంటున్నారు. -
ఎట్టిపరిస్థితుల్లోనూ భారత భద్రతకు ముప్పును అనుమతించబోం: శ్రీలంక
Sri Lanka: బాధ్యతాయుత పొరుగుదేశంగా భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను అనుమతించబోమని శ్రీలంక స్పష్టం చేసింది. గత ఏడాది చైనా గూఢచార నౌక ఒకటి శ్రీలంక తీరంలో ఆగడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
‘రక్తంతో తడిసిన రైసీ చేతులు’.. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అమెరికా
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా సంతాపం వ్యక్తం చేసింది. అయితే, ఈ సందర్భంగా ఆయనపై ఉన్న ఆరోపణలను గుర్తుచేసింది. -
అదే డేంజర్ బెల్!
ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగున్నర దశాబ్దాల నాటి హెలికాప్టర్. మరమ్మతులు, నిర్వహణకు సరైన విడిభాగాలు లేవు. ఇదేదో సరకు రవాణాకు ఉపయోగించే లోహవిహంగం కాదు.. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పయనిస్తున్న హెలికాప్టర్. -
మతబోధకుడి స్థాయి నుంచి అధ్యక్ష పీఠం వరకు
ఇబ్రహీం రైసీ.. ప్రస్తుత ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకే కాదు.. అంతకుముందు అధినేతగా ఉన్న ఖొమైనీకీ సన్నిహితుడే. ఈ ఇద్దరి అధినేతల అండతోనే మతబోధకుడిగా ప్రస్థానం ప్రారంభించిన రైసీ అధ్యక్ష స్థానం వరకు ఎదిగారు. రైసీ సంస్కరణ వాది కాదు.. కరడుగట్టిన సంప్రదాయ వాది. -
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ ఇవ్వండి
ఇజ్రాయెల్-హమాస్ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా హమాస్, ఇజ్రాయెల్ నేతలకు అరెస్టు వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ఐసీసీ) ప్రధాన ప్రాసిక్యూటర్ సోమవారం కీలక అభ్యర్థనలు చేశారు. -
శ్రీలంక ఆలయంలో సరయు నదీ జలాలతో కుంభాభిషేకం
శ్రీలంకలోని సీతా అమ్మన్ ఆలయానికి ఆదివారం నిర్వహించిన కుంభాభిషేకం కార్యక్రమంలో శ్రీలంక, భారత్, నేపాల్కు చెందిన వేల మంది భక్తులు పాల్గొన్నట్లు భారత హైకమిషన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. -
అసాంజేకు భారీ ఊరట
గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు సోమవారం లండన్ న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. -
‘కలుషిత రక్తం’ కుంభకోణంపై రిషి సునాక్ క్షమాపణలు
బ్రిటన్లో 1970ల్లో చోటుచేసుకున్న కలుషిత రక్తం కుంభకోణాన్ని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) కప్పిపుచ్చినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రధానమంత్రి రిషి సునాక్ సోమవారం క్షమాపణలు తెలిపారు. -
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్సులోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. తక్షణం రంగంలోకి దిగిన ‘ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ’ ఘటన జరిగిన ప్రాంతాన్ని సోమవారం ఉదయం గుర్తించింది. -
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసినా.. అనేక మందితో లైంగిక కార్యకలాపాలు కొనసాగించిన ఓ సెక్స్ వర్కర్ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
ఏపీ ఎన్నికల్లో హింస.. 85 మంది నిందితులపై హిస్టరీ షీట్: డీజీపీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఆ ఒక్క సీటు మినహా యూపీలో భాజపాకు ఓటమే: అఖిలేశ్