Viral news: చాక్లెట్ల దొంగకు 18 నెలల జైలు శిక్ష
చాక్లెట్లు దొంగతనం చేసిన ఓ వ్యక్తికి బ్రిటన్ న్యాయస్థానం 18 నెలల జైలు శిక్ష విధించింది
ఇంటర్నెట్డెస్క్: చాక్లెట్లు దొంగతనం చేసినందుకు ఓ వ్యక్తికి న్యాయస్థానం 18 నెలల జైలుశిక్ష విధించింది. అదేంటి ఆమాత్రం దానికి అంత పెద్దశిక్ష ఏంటి అనుకుంటున్నారా? ఆ వ్యక్తి దొంగిలించినవి ఒకట్రెండు కాదు.. ఏకంగా 2 లక్షల చాక్లెట్లు వాటి విలువ దాదాపు రూ.42 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ఘటన బ్రిటన్లో జరిగింది. అక్కడి మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 11న జోబే పూల్ అనే వ్యక్తి స్టఫోర్డ్ పార్క్ ఏరియాలోని ఎస్డబ్ల్యూ గ్రూప్ లాజిస్టిక్స్ పరిశ్రమకు చెందిన ఓ యూనిట్లోకి అక్రమంగా చొరబడి.. చాక్లెట్లు ఉన్న పెద్ద పెట్టెను తన వాహనంలోకి తీసుకొని వెళ్లిపోయాడు.
కొద్ది దూరంలో చెక్పాయింట్ను కూడా దాటేశాడు. కానీ, అనుమానం వచ్చిన పోలీసులు అతడి వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టగా దాదాపు ఆరు నెలల తర్వాత తాజాగా అతడికి న్యాయస్థానం 18 నెలల జైలు శిక్ష విధించింది. ఇప్పటి వరకు పోలీసు కస్టడీలో ఉన్న సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా చివరి 9 నెలలపాటు జైలులో ఉండకుండా సంబంధిత అధికారుల అనుమతి తెచ్చుకోవచ్చని నేరస్తుడికి సూచించింది.
నియంత్రణ లేకుంటే.. యూఎస్ నుంచే కొవిడ్ తరహా మహమ్మారి!
మరోవైపు వాదన సమయంలో జోబే పూల్ తరఫు న్యాయవాది వాదనలు భిన్నంగా ఉన్నాయి. జోబే పూల్ను పోలీసులు పట్టుకోలేదని, దొంగతనం చేసిన తర్వాత తనను పోలీసులు అనుసరిస్తున్నారని తెలుసుకొని అతడే వాహనాన్ని నిలిపేసి వారి ఎదుట లొంగిపోయాడని ఆయన చెప్పుకొచ్చారు. అందువల్ల శిక్ష తగ్గించాలని కోర్టును కోరారు. కానీ, ఈ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కేసుకు సంబంధించి విషయాలను వెస్ట్మెర్సియా పోలీసులు ట్విటర్లో పోస్టు చేశారు. ‘క్రీమ్ ఎగ్ ఫ్యాన్స్’కు వెస్ట్మెర్సియా పోలీసులు ఎంతో సాయం చేశారు. 2 లక్షల క్రీమ్ఎగ్ చాక్లెట్లను దొంగ బారి నుంచి కాపాడారు.’’ అంటూ రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM