Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..
1.ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. సిద్ధం సభలకు వేల సంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలిస్తుండటంతో సాధారణ ప్రయాణికులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. వీరికి చుట్టమని చెప్పుకొనే ఒక జడ్పీటీసీ కూడా ఆయన పరిధిలో వసూళ్లు చేసి ఈ కుటుంబానికి ముట్టజెబుతున్నారు. మొదట నియోజకవర్గ కేంద్రంలో ప్రజాప్రతినిధి పుత్రరత్నం సెటిల్మెంట్లలో దుందుడుకుగా వ్యవహరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ప్రతిష్ఠాత్మకం.. పక్కా వ్యూహం
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న కీలక ఎన్నికలు కావడంతో కాంగ్రెస్, భారాస, భాజపాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అప్పటి ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను ఇప్పుడు మరింత పకడ్బందీగా అమలుచేస్తున్నాయి. ప్రతి అవకాశాన్ని ఓట్లుగా మలచుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. జగన్ కుటుంబ ఆస్తుల విలువ రూ.757.65 కోట్లు
పేదలకు, పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతోందని... తాను పేదలకు ప్రతినిధినని పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ ఒక్కరి పేరిటే రూ.529.87 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. ఆయన భార్య వైఎస్ భారతిరెడ్డి, కుమార్తెలు వైఎస్ హర్షిణిరెడ్డి, వైఎస్ వర్షారెడ్డిల పేరిట ఉన్న ఆస్తులనూ కలిపితే వాటి విలువ రూ.757.65 కోట్లు. ఇది జగన్ కుటుంబ ఆస్తుల విలువ. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5.ఇదేనా జగన్.. మీరు చెప్పిన ఊళ్లు
జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్నవి ఇళ్లు కాదు ఊళ్లు అంటూ ముఖ్యమంత్రి, వైకాపా నాయకులు ఊదరగొట్టారు. పూర్తిస్థాయి మౌలిక వసతులతో పట్టణాల మాదిరిగా తయారవుతాయని ప్రగల్భాలు పలికారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తున్న సాయం పునాదులు, గోడలు నిర్మించడానికే సరిపోతోంది. సామాన్యులకు ఇసుక బంగారమైపోయింది. ఇళ్ల నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. సత్యదేవుడి సేవల్లోనూ వైకాపా వేలు
సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై... చర్చకు దారి తీసినా పట్టించుకోకుండా ముందడుగు వేశారు. ఇదీ ప్రస్తుత వైకాపా ప్రభుత్వ హయాంలో అన్నవరం దేవస్థానంలో గత అధికారి వ్యవహరించిన తీరు. ఓ మంత్రి అండతో దేవస్థానం వర్గాల పూర్తిస్థాయి అభిప్రాయం తీసుకోకుండా ఇష్టానుసారం వ్యవహరించారనే విమర్శలూ ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. ఒడిశాలో ఈ నెల 15 నుంచి, పశ్చిమ బెంగాల్లోని గంగా పరీవాహక ప్రాంతంలో 17 నుంచి తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఖర్గే వద్దకు ఖమ్మం పంచాయితీ
ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి ఎంపిక పంచాయితీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు చేరింది. గత కొన్ని రోజులుగా చర్చల మీద చర్చలు జరుగుతున్నా ముఖ్య నాయకులు ఎవరికి వారు తాము సూచించిన వారికే ఇవ్వాలని ఒత్తిడి తెస్తుండటంతో చివరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద సోమవారం ఉదయం బెంగళూరులో పంచాయితీ జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఖర్గే సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నాటి పరీక్ష ద్వారా జరిపిన పాతిక వేలకుపైగా నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది. వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. మొత్తం 93 స్థానాలకు గాను సొంతంగా 68 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో ముయిజ్జు అనుసరిస్తున్న చైనా అనుకూల విధానానికి దేశంలో బలమైన మద్దతు లభించినట్లయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ