జగన్ కుటుంబ ఆస్తుల విలువ రూ.757.65 కోట్లు
పేదలకు, పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతోందని... తాను పేదలకు ప్రతినిధినని పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ ఒక్కరి పేరిటే రూ.529.87 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి.
ఆయన ఒక్కరి ఆస్తే రూ.529.87 కోట్లు
జగన్ భార్య, కుమార్తెకు రిలయన్స్, జియో ఫైనాన్షియల్స్లో పెట్టుబడులు
2019తో పోలిస్తే రూ.154.67 కోట్లు పెరిగిన సీఎం ఆస్తి
కుటుంబ ఆస్తుల విలువ రూ.247.27 కోట్ల పెరుగుదల
జగన్ కుటుంబంలో ఎవరికీ సొంత కారు లేదని ప్రకటన
ఈనాడు - అమరావతి
పేదలకు, పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతోందని... తాను పేదలకు ప్రతినిధినని పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ ఒక్కరి పేరిటే రూ.529.87 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. ఆయన భార్య వైఎస్ భారతిరెడ్డి, కుమార్తెలు వైఎస్ హర్షిణిరెడ్డి, వైఎస్ వర్షారెడ్డిల పేరిట ఉన్న ఆస్తులనూ కలిపితే వాటి విలువ రూ.757.65 కోట్లు. ఇది జగన్ కుటుంబ ఆస్తుల విలువ. వీటిల్లో అత్యధిక మొత్తం వివిధ కంపెనీల్లో వాటాలు, పెట్టుబడుల రూపంలో ఉన్నవే. జగన్ తరఫున వైఎస్ మనోహర్రెడ్డి పులివెందుల రిటర్నింగ్ అధికారికి సోమవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. దాంతో అఫిడవిట్ దాఖలుచేశారు. అందులో ఆస్తుల విలువను పొందుపరిచారు. 2019లో జగన్ ఒక్కరి ఆస్తుల విలువ రూ.375.20 కోట్లు కాగా.. గత ఐదేళ్లలో ఆయన ఆస్తుల విలువ రూ.154.67 కోట్ల మేర.. అంటే 41.22% పెరిగింది. 2019లో జగన్ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.510.38 కోట్లు కాగా.. అయిదేళ్లలో రూ.247.27 కోట్లు.. అంటే 48.45% పెరిగింది.
ఒక్కరికి కూడా సొంత కారు లేదట: జగన్, ఆయన భార్య భారతిరెడ్డి, కుమార్తెలు హర్షిణిరెడ్డి, వర్షారెడ్డిల్లో ఏ ఒక్కరికీ సొంత కారు లేదట. వాళ్ల పేరుతో కార్లు ఉన్నట్లు అఫిడవిట్లో ఎక్కడా పేర్కొనలేదు.
- జగన్ పేరుతో ఒక బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనం ఉంది. అది తన సొంతానిది కాదని, హోం మంత్రిత్వశాఖ సమకూర్చిన వాహనమని అఫిడవిట్లో ప్రస్తావించారు.
వివిధ కంపెనీల్లో పెట్టుబడులు
- జగన్కు ఏడు కంపెనీల్లో, ఆయన భార్య భారతికి 22 కంపెనీల్లో, వాళ్ల కుమార్తె హర్షిణిరెడ్డికి 7 కంపెనీల్లో, వర్షారెడ్డికి 9 కంపెనీల్లో పెట్టుబడులున్నాయి. వీరందరికీ కలిపి వివిధ కంపెనీల్లో రూ.344,03,77,886 విలువైన పెట్టుబడులున్నాయి. వివరాలివి.
జగన్కు రూ.263.64 కోట్ల ఈక్విటీ షేర్లు
- వైఎస్ జగన్మోహన్రెడ్డి: రూ.263,64,92,685
- భారతీ సిమెంట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, హరీష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో జగన్కు రూ.263,64,92,685 విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి.
రిలయన్స్, జియో ఫైనాన్స్లో భారతిరెడ్డి పెట్టుబడులు
- వైఎస్ భారతిరెడ్డి పెట్టుబడులు: రూ.69,42,10,710
- జగన్ భార్య వైఎస్ భారతిరెడ్డికి 11 కంపెనీల్లో రూ.53,08,47,931 విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి. సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కెల్వెన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హరీష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆకాశ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారతి సిమెంట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, రేవన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, యుటోపియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఈ షేర్లు ఉన్నాయి.
- మకరియోస్ ఎల్ఎల్పీ, భగవత్ సన్నిధి ఎస్టేట్స్ ఎల్ఎల్పీల్లో రూ.13,94,91,693 విలువైన పెట్టుబడులతో పరిమిత భాగస్వామ్యం ఉంది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్స్, ఎన్ఎండీసీ, ఏషియన్ పెయింట్స్, కోల్గేట్ పామోలివ్, ఓఎన్జీసీ, సెయిల్, ఆల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్లో రూ.1,52,17,143 విలువైన పెట్టుబడులున్నాయి. రూ.75.01 లక్షల విలువైన సావరిన్ గోల్డ్ బాండ్లున్నాయి.
వైఎస్ హర్షిణిరెడ్డి, వర్షారెడ్డి పేరిట..
- జగన్ కుమార్తెలు వైఎస్ హర్షిణిరెడ్డికి రూ.10,01,65,515, వైఎస్ వర్షారెడ్డికి రూ.9,95,08,976 పెట్టుబడులున్నాయి.
- మకరియోస్ ఎల్ఎల్పీ, భగవత్ సన్నిధి ఎస్టేట్స్ ఎల్ఎల్పీల్లో హర్షిణిరెడ్డి, వర్షారెడ్డిలకు చెరో రూ.7,48,71,758 విలువైన పరిమిత భాగస్వామ్య పెట్టుబడులున్నాయి.
- హర్షిణిరెడ్డికి కెల్వన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో రూ.2,03,85,500 విలువైన ఈక్విటీ షేర్లున్నాయి. ఎస్బీఐ, సనోఫి ఇండియా, ఏషియన్ పెయింట్స్, గ్లాక్సో స్మిత్క్లిన్ ఫార్మాలో రూ.26.17 లక్షల విలువైన ఈక్విటీ షేర్లున్నాయి.
- వర్షారెడ్డికి కెల్వన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో రూ.2,03,85,500 విలువైన ఈక్విటీ షేర్లున్నాయి. జెన్సర్ టెక్, సనోఫి ఇండియా, ఏషియన్ పెయింట్స్, గ్లాక్సో స్మిత్క్లిన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్స్లలో రూ.19.61 లక్షల విలువైన ఈక్విటీ షేర్లున్నాయి.
జగన్ కుమార్తెలకు విదేశాల్లోనూ ఆస్తులు
- జగన్ కుమార్తెలు హర్షిణిరెడ్డికి రూ.1,31,75,471, వర్షారెడ్డికి రూ.1,54,78,466 విలువైన విదేశీ ఆస్తులున్నాయి.
గత అయిదేళ్లలో భారతి పేరిట అరకిలో పైనే బంగారు, వజ్రాభరణాలు పెరిగాయి
- జగన్మోహన్రెడ్డికి బంగారు ఆభరణాలేవీ లేవు. భారతి పేరిట రూ.5,29,87,319 విలువ చేసే 6,427.79 గ్రాములు, హర్షిణిరెడ్డి పేరిట రూ.4,43,35,816 విలువైన 4,187.19 గ్రాములు, వర్షారెడ్డి పేరిట రూ.4,46,82,885 విలువైన 3,457.33 గ్రాముల బంగారు, వజ్రాభరణాలున్నాయి.
- 2019లో భారతిరెడ్డి పేరిట రూ.3,57,16,658 విలువైన 5,862.818 గ్రాములు ఉండేది. గత అయిదేళ్లలో ఆమె అదనంగా 564 గ్రాములు బంగారు, వజ్రాభరణాలు సమకూర్చుకున్నారు.
- జగన్ చేతిలో రూ.7వేలు, భారతిరెడ్డి చేతిలో రూ.10,022, కుమార్తె హర్షిణిరెడ్డి చేతిలో రూ.9వేలు, వర్షారెడ్డి చేతిలో రూ.6,987 మాత్రమే నగదు ఉందట.
- జగన్ ఓ సంస్థకు రూ.43.10 కోట్లు అప్పు ఇచ్చారు. మరికొందరికి రూ.136.15 కోట్లు రుణమిచ్చారు. వివిధ రుణగ్రహీతల నుంచి ఆయనకు రూ.48.95 లక్షలు రావాలి. భారతిరెడ్డికి రుణగ్రహీతల నుంచి రూ.4.37 కోట్లు రావాలి. ఇదికాకుండా రూ.26.54 లక్షల మేర రుణాలిచ్చారు. వాళ్ల కుమార్తె హర్షిణిరెడ్డి రూ.2.43 కోట్లు, వర్షారెడ్డి రూ.2.68 కోట్లు అడ్వాన్సులుగా ఇచ్చారు.
- జగన్కు రూ.1,10,78,350, భారతికి రూ.7,41,79,353, హర్షిణిరెడ్డికి, రూ.9,02,00,000, వర్షారెడ్డికి రూ.9,02,00,000 మేర అప్పులున్నాయి.
తాడేపల్లి ప్యాలెస్ భారతిరెడ్డి పేరుతోనే
- తాడేపల్లిలో వైఎస్ భారతిరెడ్డికి 47, 52 నంబర్ల విల్లాలున్నాయి. ఒకటి 41,382 చదరపు అడుగుల విస్తీర్ణంలో, మరోకటి 8,525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 2019 జనవరి 31న వీటిని కొన్నారు. ఒక విల్లా ఖరీదు రూ.11.50 కోట్లు కాగా, మరొకదాని విలువ రూ.1.91 కోట్లు.
జగన్ పేరిట ఇడుపులపాయలో భూములు
- జగన్మోహన్రెడ్డికి ఇడుపులపాయలో వివిధ సర్వే నంబర్లలో 39.52 ఎకరాల్లో రూ.1,54,12,800 విలువైన వ్యవసాయ భూమి ఉంది. పులివెందుల మండలం భాకరాపురంలో రూ.11.03 కోట్ల విలువైన 4,51,282 చదరపు అడుగుల వ్యవసాయేతర భూమి ఉంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లో రూ.20.92 కోట్ల విలువైన వాణిజ్య భవనం 37,415 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో ఉంది. బంజారాహిల్స్ సాగర్ సొసైటీ, భాకరాపురంలో రూ.13.29 కోట్ల విలువైన రెండు వేర్వేరు నివాస భవనాలున్నాయి.
- భారతిరెడ్డి పేరుతో కాచివారిపల్లెలో, యర్రగుడిపల్లె, భాకరాపురం, పులివెందులల్లోని వివిధ సర్వే నంబర్లలో రూ.28.57 కోట్ల విలువైన వ్యవసాయేతర భూములున్నాయి. పులివెందుల, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో రూ.14.28 కోట్ల విలువైన వాణిజ్య భవనాలున్నాయి.
30 సంస్థలతో ఒప్పందాలు
జగన్కు సంబంధించిన భారతీ సిమెంట్స్ సంస్థ 30 సంస్థలతో పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. విద్యుత్తు కొనుగోలు, బొగ్గు కొనుగోలు, మైనింగ్ లీజు, లిగ్నైట్ సరఫరా, పెట్ కోక్ కొనుగోలుకు ఈ ఒప్పందాలున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్