ఖర్గే వద్దకు ఖమ్మం పంచాయితీ
ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి ఎంపిక పంచాయితీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు చేరింది.
భట్టి, పొంగులేటితో విడివిడిగా సమావేశం
అధిష్ఠానంతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామన్న పార్టీ అధ్యక్షుడు
ఈనాడు, హైదరాబాద్: ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి ఎంపిక పంచాయితీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు చేరింది. గత కొన్ని రోజులుగా చర్చల మీద చర్చలు జరుగుతున్నా ముఖ్య నాయకులు ఎవరికి వారు తాము సూచించిన వారికే ఇవ్వాలని ఒత్తిడి తెస్తుండటంతో చివరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద సోమవారం ఉదయం బెంగళూరులో పంచాయితీ జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఖర్గే సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్షీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదట ఇద్దరితో వేర్వేరుగా, తర్వాత ఇద్దరితో కలిపి చర్చించినట్లు తెలిసింది. తొలుత భట్టి.. తన సతీమణికి టికెట్ ఇవ్వాలని కోరగా, దానికి అంగీకరించలేదని తెలిసింది. దాంతో పొంగులేటి కుటుంబ సభ్యులకు కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరు సూచించినట్లు సమాచారం. కాంగ్రెస్లో చేరినప్పుడు తాను సూచించిన వ్యక్తికి లోక్సభ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చిన మేరకు సీట్లు కేటాయించలేదని పొంగులేటి అన్నట్లు తెలిసింది. ‘‘నా సోదరుడు ప్రసాదరెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నా. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నా. అయితే పార్టీ నాయకులు రఘురామిరెడ్డి పేరును తెరమీదకు తెచ్చారు. ఆయన పాత తరం కాంగ్రెస్ నాయకుడు రామసహాయం సురేందర్రెడ్డి కుమారుడిగానే కాకుండా ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. నాతో రఘురామిరెడ్డికి బంధుత్వం ఇటీవల కాలంలోనే ఏర్పడింది’’ అని చెప్పినట్లు సమాచారం. ఇద్దరితో కలిసి చర్చించిన తర్వాత.. పార్టీ అధిష్ఠానం ముఖ్యులతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని, ఎవరికి ఇచ్చినా కలిసి విజయం కోసం పని చేయాలని సూచించినట్లు తెలిసింది. తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖర్గేతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని చెప్పినట్లు తెలిసింది. ఖమ్మంకు రఘురామిరెడ్డి, కరీంనగర్కు వెలిచాల రాజేందర్రావు, హైదరాబాద్కు షమీవలీ ఉల్లా పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యలో తెరపైకొచ్చిన మండవ వెంకటేశ్వరరావు పేరు పక్కకు వెళ్లినట్లు సమాచారం.
మొదటి నుంచీ తీవ్ర పోటీ...: ఖమ్మం లోక్సభ స్థానానికి మొదటి నుంచి ముఖ్యనాయకుల మధ్య పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపిక అధిష్ఠానానికి జటిలంగా మారింది. భట్టి.. తన భార్య నందినికి, మంత్రి పొంగులేటి.. తన సోదరుడు ప్రసాదరెడ్డికి, తుమ్మల.. తన కుమారుడు యుగంధర్కు టికెట్ ఇవ్వాలని కోరుతూ వచ్చారు. దీనిపై స్క్రీనింగ్ కమిటీలోనూ, కేంద్ర ఎన్నికల కమిటీలోనూ చర్చల మీద చర్చలు జరిగిన తర్వాత మంత్రుల కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడానికి అధిష్ఠానం అంగీకరించలేదు. ఇదే సమయంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్, తుమ్మల సానుకూలత వ్యక్తం చేయడంతో మండవ పేరు దాదాపు ఖరారైందనే ప్రచారం జరిగింది. అయితే భట్టి రాయల నాగేశ్వరరావు పేరును కూడా సూచించినట్లు తెలిసింది. దీంతో ఖర్గే సోమవారం భట్టి, పొంగులేటిలతో బెంగళూరులో మాట్లాడారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ సుల్తాన్లకు భయపడం
‘రిజర్వేషన్ల అమలు అంశంపై నేను మాట్లాడుతుంటే భాజపాకు గిట్టడం లేదు. అందుకే దిల్లీ పోలీసులతో అమిత్షా కేసు పెట్టించారు. భారాస పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎన్నో కేసులు పెట్టారు. -
దిల్లీ పోలీసులు X హైదరాబాద్ పోలీసులు
ఉదయాన్నే గాంధీభవన్కు దిల్లీ పోలీసులు.. మరోవైపు హైదరాబాద్ సైబర్క్రైం పోలీసుల అదుపులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగం వారియర్లు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి గురువారం హైడ్రామా నడిచింది. -
భాజపా కనుసన్నల్లో ఎన్నికల కమిషన్
భాజపా కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని తాము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
8న రాష్ట్రానికి మోదీ
భాజపా అగ్రనేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి ప్రకటన విడుదల చేశారు. -
కాంగ్రెస్లోకి మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ
సంగారెడ్డికి చెందిన మాజీ ఎమ్మెల్సీ, భారాస నేత సత్యనారాయణ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
సంక్షిప్త వార్తలు
-
మోసపోయి కాంగ్రెస్కు ఓటేయొద్దు: భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు, డొంకేశ్వర్ మండల కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అభివృద్ధిపై జానారెడ్డికి సవాలు విసిరిన భారాస ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సవాలు విసిరారు. -
పంద్రాగస్టు తర్వాత సిద్దిపేటకు విముక్తి కల్పిస్తా: రేవంత్ రెడ్డి
ఆరునూరైనా మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని సీఎం రేవంత్రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. -
కొండా విశ్వేశ్వర్రెడ్డి వినతిపై నిర్ణయం తీసుకోండి: ఈసీకి హైకోర్టు సూచన
కొండా విశ్వేశ్వర్రెడ్డి సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. -
భాజపాకు ఓటు వేస్తే.. రాజ్యాంగాన్ని మార్చేస్తారు: సీఎం రేవంత్రెడ్డి
రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్పుపై మాట్లాడుతున్నానన్న కారణంతోనే తనపై కేసులు పెడుతున్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
ఫోన్ ట్యాపింగ్.. నాతో పాటు రేవంత్, హరీశ్రావు బాధితులే: బండి సంజయ్
సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్లోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
భారాసకు ఒక్క స్థానం రావడమూ కష్టమే: మంత్రి ఉత్తమ్
మతాన్ని అడ్డుపెట్టుకుని భాజపా విద్వేషాలు రెచ్చగొడుతోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
లోక్సభ ఎన్నికలు.. తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టో
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్ (Congress) పార్టీ విడుదల చేయనుంది. -
కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారాస అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) 48 గంటల పాటు నిషేధం విధించింది. -
రేవంత్రెడ్డిపై నిషేధం ఏదీ?
ఎన్నికల ప్రచారంలో 48 గంటలపాటు పాల్గొనవద్దని తనపై నిషేధం విధించిన కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ).. ‘పేగులు మెడలో వేసుకుంటా.. గుడ్లు పీకుతా’ అంటూ అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్రెడ్డిపై నిషేధం ఎందుకు పెట్టలేదని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. -
భాజపాకు రజాకార్లకు పట్టిన గతే
‘గుజరాత్ ఆధిపత్యానికి.. తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరు ఇది.. కుట్రలకు పాల్పడుతున్న భాజపాకు నిజాం, రజాకార్లకు పట్టిన గతే పడుతుంది’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. -
రాజ్యాంగం ఉండాలా.. వద్దా..?
దేశంలో భాజపాకు వేసే ప్రతి ఓటూ రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుందని.. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు దూరమవుతాయని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. -
రజాకార్ల వారసుల నుంచి విముక్తి కల్పించాలి
రజాకార్ల వారసుల నుంచి హైదరాబాద్కు విముక్తి కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రజలను కోరారు. గత 40 ఏళ్లుగా రజాకార్ల వారసులు హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఈసారి హైదరాబాద్ లోక్సభ స్థానానికి భాజపా తరఫున పోటీ చేస్తున్న మాధవీలతకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. -
106 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 గంటల వరకు పోలింగ్
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని మరో గంట పాటు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఉత్తర్వులు జారీ చేసింది. -
తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలి
పదేళ్ల యూపీఏ హయాంలో, తొమ్మిదిన్నరేళ్ల ఎన్డీయే ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధికి ఏం చేశారన్న అంశంపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సవాల్ విసిరారు.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్