సత్యదేవుడి సేవల్లోనూ వైకాపా వేలు
సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై...
నాటి అధికారి అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బందులు
న్యూస్టుడే, అన్నవరం: సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై... చర్చకు దారి తీసినా పట్టించుకోకుండా ముందడుగు వేశారు. ఇదీ ప్రస్తుత వైకాపా ప్రభుత్వ హయాంలో అన్నవరం దేవస్థానంలో గత అధికారి వ్యవహరించిన తీరు. ఓ మంత్రి అండతో దేవస్థానం వర్గాల పూర్తిస్థాయి అభిప్రాయం తీసుకోకుండా ఇష్టానుసారం వ్యవహరించారనే విమర్శలూ ఉన్నాయి. గత సత్యదేవుని వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శ్రీపుష్పయాగం నిర్వహణ అప్పట్లో చర్చనీయాంశమైంది. వచ్చే నెలలో కల్యాణోత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. స్వామివారి నివేదన శాల ఏర్పాటు, ప్రదక్షిణ దర్శనం అమల్లోకి తీసుకురావడం కూడా చర్చనీయాంశమయ్యాయి.
అన్నవరం అనివేటి మండపంలో ఏటా శ్రీపుష్పయోగ మహోత్సవం జరుగుతోంది. గత ఏడాది మే 6న జరిగిన ఈ మహోత్సవాన్ని వార్షిక కల్యాణ వేదిక వద్ద నిర్వహించారు. గతంలో ఓసారి వార్షిక కల్యాణ వేదిక వద్ద శ్రీపుష్పయోగం నిర్వహించాలని భావించినా పండితులు అభ్యంతరం తెలపడంతో నిత్యకల్యాణ మండపంలోనే చేపట్టారు. ఏకాంతంగా జరిగే కార్యక్రమం బయట నిర్వహించడం సరికాదని గత ఏడాది కూడా కొందరు పండితులు చెప్పినట్లు సమాచారం. అయినా పట్టించుకోకుండా గత అధికారి ఆలయ ప్రాంగణంలోని వార్షిక కల్యాణవేదిక వద్దే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది మే 24న శ్రీపుష్పయోగం జరుగుతుంది. ఈసారి అధికారులు ఎక్కడ ఏం చేస్తారోననే చర్చ నడుస్తోంది.
ఆలయం బయట సర్క్యులర్ మండపంపై నిర్మించిన నివేదన శాల
ప్రదక్షిణ దర్శనంలోనూ..
దేవస్థానంలో రూ.300 టికెట్టు తీసుకున్న భక్తులు ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకునేలా గత ఏడాది ఏర్పాట్లు చేశారు. ప్రధానాలయం కింద అంతస్తులో యంత్రాలయంలో చుట్టూ పంచాయతన దేవతలు ఉండగా పైన ప్రదక్షిణ ఏమిటని విమర్శలొచ్చాయి. దీంతో యంత్రా లయానికి సమాంతరంగా పై అంతస్తులో నాలుగు మూలలా స్వర్ణ అభిషేక చందనం, స్వర్ణ హుండీ, కల్పవృక్షం, కామధేనువు ఏర్పాటు చేశారు.
శాస్త్ర సమ్మతం కాకపోయినా..
సత్యదేవుని నివేదన శాల మార్పు చర్చనీయాంశమైంది. ఇది ఆలయ ప్రాకారానికి చేర్చి ఉండేది. అక్కడే స్వామివారికి నివేదనను అర్చకులు సిద్ధం చేసేవారు. గత ఈవో ఏకపక్షంగా దీన్ని మార్పుచేశారు. ముందుగా రూ.800 వ్రత మండపం పైభాగానికి మార్చారు. ఆ తర్వాత బయట సర్క్యులర్ మండపంపైన నిర్మించారు. విమర్శలు రావడంతో మళ్లీ ఆలయ ప్రాకారానికి చేర్చి నివేదన శాల ఏర్పాటుకు పనులు ప్రస్తుతం చేపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముమ్మరంగా ఉమ్మడి ప్రచారం
[ 02-05-2024]
ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోను ప్రజలంతా స్వాగతిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీ విజయం సాధిస్తుందని ముప్పిడి సుజాత తెలిపారు. -
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
[ 02-05-2024]
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతవులు గురువారం పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ప్రశాంతంగా హోం ఓటింగ్
[ 02-05-2024]
మండలంలో హోం ఓటింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. రెండు బృందాల పర్యవేక్షణలో అధికారులు ఇంటింటికి వెళ్లి జాబితాలో నమోదైన ఓటర్లు ఓటు వేసేలా చర్యలు చేపట్టారు. -
తాళ్లపూడిలో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
ఉమ్మడి పార్టీల మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. -
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
[ 02-05-2024]
గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
ఇసుక తోడేళ్లు..
[ 02-05-2024]
కట్టడాలకు వినియోగించే ఇసుక కోసం గుంతలు తీసి పచ్చటి బతుకులు కూల్చేశారు. యంత్రాలతో తవ్వకాలు వద్దన్నా వినరు. ప్రశాంత గోదారమ్మ గుండెల్లో పొక్లెయినర్లతో తవ్వి ఇసుక తోడేస్తారు. ఎన్జీటీ హెచ్చరించినా పట్టదు.. కోర్టులు మొట్టికాయలు వేసినా లెక్కలేనితనం. -
వైకాపా కోటలు బద్దలు కొడదాం
[ 02-05-2024]
మండపేటలో బుధవారం నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ వైకాపా అరాచక పాలనపై ధ్వజమెత్తారు. కూటమి అభ్యర్థుల విజయం ద్వారా దీనికి చరమగీతం పాడవచ్చన్నారు. -
బాబ్బాబు.. పార్టీ మారొద్దు..
[ 02-05-2024]
నిడదవోలు వైకాపా నేతలు వరుసగా రాజీనామాలు చేసి జనసేన, తెదేపాల బాట పడుతుండటంతో ఆ పార్టీ ముఖ్య నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఉన్నవారు చేజారిపోకుండా నియోజకవర్గ నాయకుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
‘రౌడీ రాజ్యాన్ని ఓటుతో తరిమికొట్టండి’
[ 02-05-2024]
ఓటుతో రౌడీ రాజ్యాన్ని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఎన్డీయే కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరి, గ్రామీణ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్చచౌదరి పిలుపునిచ్చారు. -
టీకాలకూ ఠికానా లేదు..!
[ 02-05-2024]
వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యమిస్తున్నామని.. అందరికీ మెరుగైన సేవలందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. -
నువ్వూ వద్దు.. నీ పనులూ వద్దు..
[ 02-05-2024]
ఒక్కసారి అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని జగన్మోహన్రెడ్డి వాగ్ధానాలు చేశారు. ప్రజలు నిజమేనని నమ్మి ఓటేశారు.. తీరా పీఠమెక్కిన తర్వాత బటన్ నొక్కడం తప్ప రోడ్లు బాగుచేయడం వంటి కీలక అంశాలు మరిచారు. -
భిక్షనుకున్నారా?.. కక్షగట్టారా..?
[ 02-05-2024]
నిరుపేద ఎస్సీలకు స్వయం ఉపాధి కల్పించేందుకు గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బ్యాంకు లింకేజీ, పూర్తి రాయితీ రుణాలను అందించేవారు. కిరణా దుకాణాలు, టెంటు హౌస్లు, ఆటోలు, కార్లు, వంటి యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఎస్సీలు స్వయం ఉపాధి బాటపట్టేవారు. -
రాజకీయాల్లో నేర చరితులను అడ్డుకోవాలి
[ 02-05-2024]
నేరచరిత్ర ఉన్నవారిని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు పిలుపునిచ్చారు. బుధవారం రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో జిల్లా అభ్యదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘ఎన్నికల భారతం’ -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉందా..?
[ 02-05-2024]
హోం మంత్రిగా మహిళ ఉన్న రాష్ట్రంలో శాంతి, భద్రతలు లేవని, మహిళలపై హత్యలు, అత్యాచారాలకు ఎక్కువయ్యాయని గోపాలపురం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు విమర్శించారు. -
భాజపాకు 200 సీట్లు కూడా కష్టమే
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 200 స్థానాల్లో కూడా గెలవడం కష్టమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇప్పటివరకు జరిగిన రెండు దశల ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమైందన్నారు. -
ఎంపీ గుట్టు బయటపెడతాం: ఆదిరెడ్డి
[ 02-05-2024]
యువతను జగన్ మోసం చేశారని కూటమి అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
చర్చిలో వైకాపా నేతల ప్రచారం
[ 02-05-2024]
కాకినాడ గ్రామీణం రాయుడుపాలెం సీటీసీ చర్చిలో బుధవారం వైకాపా నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా