Whatsapp: వాట్సాప్‌పై అవన్నీ వదంతులే.. ఎవరూ నమ్మొద్దు: కేంద్రం

ఏదైనా ఒక కొత్త విషయం సామాజిక మాధ్యమాల్లో వస్తే చాలు.. అనేకమంది ముందు వెనకా ఆలోచించకుండా లైక్‌లు, షేర్లు కొట్టడంతో పాటు ఫార్వార్డ్‌లు చేస్తూనే ఉంటారు. .....

Updated : 13 Oct 2021 14:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా ఒక కొత్త విషయం సామాజిక మాధ్యమాల్లో వస్తే చాలు.. అనేకమంది ముందూ వెనకా ఆలోచించకుండా లైక్‌లు, షేర్లు కొట్టడంతో పాటు ఫార్వార్డ్‌లు చేస్తూనే ఉంటారు. దాంట్లో నిజమెంతో, అబద్ధమెంతో కూడా సరిచూసుకోరు. వెంటనే ఇతర గ్రూపుల్లో షేర్‌ చేస్తూ ఉంటారు. దీంతో ఆ సమాచారం క్షణాల్లోనే లక్షలాది మందికి చేరిపోతుంది. ఇటీవల కొన్ని సాంకేతిక కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు దాదాపు ఆరు గంటల పాటు నిలిచిపోవడంతో అనేక వదంతులు వ్యాపించాయి.

వాట్సాప్‌ను రాత్రి 11.30గంటల నుంచి ఉదయం 6గంటల వరకు నిలిపివేస్తున్నట్టు కేంద్రం నిర్ణయించిందని, అలాగే దీన్ని యాక్టివ్ చేసుకోవాలంటే నెలవారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, దీన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇదంతా అబద్ధపు ప్రచారమని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌ చెక్‌ ట్విటర్‌ వేదికగా స్పష్టంచేసింది. అలాంటి ప్రకటన ఏదీ కేంద్రం చేయలేదని, వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని