India-Canada: ‘భారత్లో ఆ నగరాల్లో జాగ్రత్త..’: మరోసారి కెనడా కవ్వింపులు
India-Canada: భారత్లోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలని కెనడా అడ్వైజరీ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, దౌత్య సిబ్బందిని తగ్గించిన నేపథ్యంలో ముంబయి, చండీగఢ్, బెంగళూరులో కాన్సులర్ సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు (India-Canada Diplomatic Row) మరింత ముదిరేలా కన్పిస్తున్నాయి. భారత్లో తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకున్నట్లు అధికారికంగా ప్రకటించిన కెనడా.. ఆ కాసేపటికే భారత్లోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీ (Canada Advisory) జారీ చేసి మరోసారి కవ్వింపులకు పాల్పడింది. మరోవైపు సిబ్బందిని తగ్గించిన నేపథ్యంలో ముంబయి, బెంగళూరు, చండీగఢ్లో అన్ని రకాల ఇన్-పర్సన్ సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది.
వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు..
‘‘ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. భారత్లో మీడియా, సామాజిక మాద్యమాల్లో కెనడాపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కెనడా-వ్యతిరేక ఆందోళనలు, ప్రదర్శనలు జరిగే అవకాశాలున్నాయి. కెనడియన్లపై బెదిరింపులు, వేధింపులు జరగొచ్చు. అందువల్ల దిల్లీ, ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతాల్లో కొత్త వ్యక్తులతో మీరు (కెనడియన్లు) జాగ్రత్తగా ఉండండి. వారికి ఎలాంటి వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు. బెంగళూరు (Bengaluru), చండీగఢ్ (Chandigarh), ముంబయి (Mumbai)ల్లోనూ అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఇక, సాధారణంగా పెద్ద నగరాల్లో విదేశీయులు, పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కొందరు చోరీలకు పాల్పడుతుంటారు. అందుకే, రద్దీ ప్రదేశాలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండండి’’ అని కెనడా తమ అడ్వైజరీలో పేర్కొంది.
భారత్ నుంచి 41 మంది దౌత్యసిబ్బందిని వెనక్కి రప్పించాం: కెనడా అధికారిక ప్రకటన
ఆ నగరాల్లో వీసా, కాన్సులర్ సేవలు నిలిపివేత..
ఇక, దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకున్న దృష్ట్యా.. బెంగళూరు, ముంబయి, చండీగఢ్ నగరాల్లో అన్ని రకాల ఇన్-పర్సన్ సేవలను నిలిపివేస్తున్నట్లు కెనడా తన అడ్వైజరీలో వెల్లడించింది. దీంతో ఈ నగరాల్లో వ్యక్తిగత వీసా (Visa), కాన్సులర్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని తెలిపింది. ఈ ప్రాంతాల్లోని కెనడియన్లు ఏదైనా అవసరమైతే దిల్లీలోని కెనడా హై కమిషన్ను సంప్రదించాలని సూచించింది.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇదే సమయంలో భారత అంతర్గత విషయాల్లో కెనడా దౌత్యవేత్తలు అతిగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ.. దౌత్య సిబ్బంది సంఖ్య విషయంలో సమస్థాయిని పాటించాలని సూచించింది. ఈ క్రమంలోనే కెనడా తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని న్యూదిల్లీ అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి 41 మంది దౌత్యసిబ్బందిని వెనక్కి రప్పించినట్లు కెనడా తాజాగా అధికారికంగా ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కడుపులో పిండానికీ జీవించే హక్కు’ - సుప్రీంకోర్టు
27 వారాల గర్భాన్ని తొలగించాలంటూ 20 ఏళ్ల అవివాహిత చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. -
‘మమ్ముట్టి’కి బాసటగా కేరళ నేతలు.. అసలు ఏం జరిగిందంటే?
మలయాళ నటుడు మమ్ముట్టి (Mammootty)పై ఆన్లైన్ వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాటిని వ్యతిరేకిస్తూ పలువురు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. -
కార్చిచ్చుల వేళ.. అగ్నిమాపక సిబ్బందికి ఎన్నికల విధులా..?
భారీ స్థాయిలో చెలరేగుతున్న అటవీ మంటలను అరికట్టే చర్యలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. -
ముంబయిలో బిల్బోర్డ్ ట్రాజెడీ.. ఎనిమిదేళ్ల క్రితమే పుస్తకంలో ప్రస్తావించిన రచయిత
ముంబయిలో ఇటీవల చోటుచేసుకున్న హోర్డింగ్ దుర్ఘటనను ఎనిమిదేళ్ల క్రితమే ఓ రచయిత తన పుస్తకంలో ప్రస్తావించారు. -
సీఏఏ అమల్లోకి వచ్చాక తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
సీఏఏ అమల్లోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం మంజూరుచేసింది. -
14 నెలల క్రితమే గుర్తించినా.. 14 మంది ప్రాణాలు పోయే వరకు..
ముంబయిలో 14 మంది ప్రాణాలను బలిగొన్న హోర్డింగ్ను అక్రమంగా ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. -
రఫాలో మాజీ సైన్యాధికారి మృతి.. భారత్కు ఐరాస క్షమాపణలు
గాజాలో పని చేస్తున్న భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె (46) మృతిపై ఐక్యరాజ్యసమితి సంతాపం తెలియజేసింది. -
400 సీట్లు గెలిస్తే.. భారత్లో పీవోకే విలీనం ఖాయం: హిమంత బిశ్వశర్మ
మరోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపడితే.. పీవోకేను భారత్లో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం కలిగింది. -
రాజస్థాన్ గనిలో కూలిన లిఫ్ట్ ..ఒకరి మృతి
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్కు గనిలో లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కోల్కతాకు చెందిన ఓ విజిలెన్స్ అధికారి మృతి చెందారు. -
ఆమెపై కుట్ర చేస్తున్నారు.. సంజయ్సింగ్ది నటన: స్వాతీమాలీవాల్ మాజీ భర్త ఆరోపణలు
ఒక కుట్రలో భాగంగానే స్వాతీమాలీవాల్ (Swati Maliwal)పై దాడి జరిగిందని ఆమె మాజీ భర్త ఆరోపించారు. -
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడికి సుప్రీం కోర్టులో ఊరట..బెయిల్ మంజూరు
‘న్యూస్క్లిక్’(NewsClick) వెబ్సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. -
కోర్టులో ఎన్నికల ఫలితాలు తేల్చుకునేవారు..మాకు హితబోధలా: వెస్టర్న్ మీడియాపై జైశంకర్ ఫైర్
Jaishankar: భారత ఎన్నికలపై విమర్శలు చేస్తున్న విదేశీ మీడియాకు జైశంకర్ చురకలంటించారు. 200 ఏళ్ల సామ్రాజ్యవాద పోకడను వదులుకోలేకపోతున్నారంటూ చురకలంటించారు. -
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే
తమ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేయడం నిజమేనని ఆప్ సీనియర్ నేత, ఎంపీ సంజయ్సింగ్ అంగీకరించారు. -
మళ్లీ బెదిరింపు ఈ-మెయిళ్లు
దేశ రాజధాని దిల్లీలో కొద్ది రోజులుగా వరుస బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా తిహాడ్ జైలుకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
దిల్లీ మద్యం కుంభకోణం నిందితుల జాబితాలో ‘ఆప్’!
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేరును నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు మంగళవారం దిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంతా శర్మకు ఈడీ నివేదించింది. -
ఐటీవో సీఆర్ భవనంలో అగ్నిప్రమాదం
సెంట్రల్ దిల్లీలోని ఐటీవోలో ఆదాయపుపన్ను సెంట్రల్ రెవెన్యూ (సీఆర్) భవనంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తూర్పు దిల్లీకి చెందిన 46 ఏళ్ల ఆదాయపు పన్ను అధికారి ఒకరు దుర్మరణం పాలయ్యారు. -
లైసెన్సులు రద్దయిన ఉత్పత్తుల విక్రయాల్ని నిలిపివేశారా?
ఉత్తరాఖండ్ అధికారులు గత నెలలో లైసెన్సులు రద్దు చేసిన 14 ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశారా లేదా అని పతంజలి సంస్థను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
రఫాలో భారత మాజీ సైన్యాధికారి మృతి
గాజాలో ఐక్యరాజ్యసమితి(ఐరాస) తరఫున పనిచేస్తున్న భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె (46) మృతి చెందారు. -
‘ఎన్నికల బాండ్లపై దర్యాప్తు’ పిటిషన్లను సత్వరమే విచారించండి
రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చిన ‘ఎన్నికల బాండ్ల’పై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన అభ్యర్థనలను సత్వరమే విచారణకు చేపట్టాలని పిటిషనర్లు సర్వోన్నత న్యాయస్థానికి విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికల వేళ సరిహద్దుల్లో డ్రోన్ల చొరబాట్లు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న గత 60 రోజుల్లో పాక్ సరిహద్దు వెంబడి 49 డ్రోన్లను కూల్చివేయడం లేదా స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా? చెన్నైతో మ్యాచ్కు వర్షం ముప్పు
-
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
-
‘కడుపులో పిండానికీ జీవించే హక్కు’ - సుప్రీంకోర్టు
-
‘మమ్ముట్టి’కి బాసటగా కేరళ నేతలు.. అసలు ఏం జరిగిందంటే?
-
గోల్ఫ్ ఆడడం, నచ్చింది తినడం.. మిస్టర్ కూల్ ‘ఫేవరెట్ ప్లేస్’ అదేనట!
-
డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్రెడ్డి అత్యవసర భేటీ