గ్యాస్ లీకేజీ వల్లే యుద్ధనౌకలో పేలుడు!
ఐఎన్ఎస్ రణ్వీర్ యుద్ధనౌకలో ముగ్గురు సిబ్బంది మరణానికి కారణమైన పేలుడుపై భారత నౌకాదళం దృష్టి సారించింది.
ఏసీ కంపార్ట్మెంట్లో విడుదలైన వాయువు
మృతులను గుర్తించిన నౌకాదళం
ముంబయి: ఐఎన్ఎస్ రణ్వీర్ యుద్ధనౌకలో ముగ్గురు సిబ్బంది మరణానికి కారణమైన పేలుడుపై భారత నౌకాదళం దృష్టి సారించింది. నౌకలోని ఎయిర్ కండిషనింగ్ కంపార్ట్మెంట్లో ఈ విస్ఫోటం చోటుచేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఫ్రియాన్ గ్యాస్ లీకేజీయే దీనికి కారణమై ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ (ఎంసీపీవో) ఫస్ట్ క్లాస్ క్రిషన్ కుమార్, ఎంసీపీవో సెకండ్ క్లాస్ సురీందర్ కుమార్, ఎంసీపీవో సెకండ్ క్లాస్ ఏకే సింగ్గా గుర్తించారు. వీరి మృతికి నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరి కుమార్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు బాసటగా ఉంటామని నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై ముంబయి పోలీసులు ‘ప్రమాదవశాత్తు జరిగిన మరణాల’ కేసు నమోదు చేశారు. మృతదేహాలకు స్థానిక జె.జె.ఆసుపత్రిలో పోస్ట్మార్టమ్ నిర్వహించారు.
రణ్వీర్.. ముంబయిలోని నేవల్ డాక్యార్డ్లో లంగరేసి ఉన్నప్పుడు మంగళవారం ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం కేంద్రంగా సేవలు అందించే ఈ యుద్ధనౌక గత ఏడాది నవంబరు నుంచి తాత్కాలికంగా ముంబయిలో విధులు నిర్వర్తిస్తోంది.
మందుగుండు సామగ్రి పేలలేదు
నౌక ప్రమాదానికి మందుగుండు సామగ్రి విస్ఫోటం కారణం కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. విస్ఫోటం జరిగినప్పుడు ఆ కంపార్ట్మెంట్లో సిబ్బంది లేరని పేర్కొన్నాయి. పేలుడు తీవ్రతకు పక్కనే ఉన్న మెస్ కంపార్ట్మెంట్ ధ్వంసమైందని వివరించాయి. బాధితులు అందులోనే ఉన్నారని, వారు శకలాల కింద చిక్కుకుపోయారని వెల్లడించాయి. 11 మంది క్షతగాత్రుల్లో ఎక్కువ మందికి ఎముకలు విరిగాయి. ఫ్రియాన్ గ్యాస్ పీల్చడం వల్ల కొందరు అస్వస్థులయ్యారు. 5వేల టన్నుల బరువుండే ఐఎన్ఎస్ రణ్వీర్లో 30 మంది అధికారులు 310 మంది నావికులు పనిచేస్తున్నారు. ఇది గరిష్ఠంగా 30 నాట్ల వేగాన్ని అందుకోగలదు. గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ తరగతికి చెందిన ఈ యుద్ధనౌక.. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి, ఉపరితలం నుంచి గగనతలంలోకి క్షిపణులను ప్రయోగించగలదు. ఇందులో విమాన విధ్వంసక తుపాకులు, టోర్పిడోలూ ఉన్నాయి. ప్రస్తుత నౌకాదళాధిపతి అడ్మిరల్ హరికుమార్ కూడా గతంలో ఈ యుద్ధనౌకకు కెప్టెన్గా వ్యవహరించారు.
ఏమిటీ ఫ్రియాన్?
ఫ్రియాన్ అనేది క్లోరోఫ్లోరోకార్బన్ (సీఎఫ్సీ) తరగతికి చెందిన వాయువు. దీన్ని ఫ్రిజ్లు, ఏసీల్లో శీతలీకరణ సాధనంగా ఉపయోగిస్తున్నారు. స్ప్రేలు, పెయింట్ థిన్నర్లలోనూ వాడుతున్నారు. ఈ వాయువుకు రంగు, వాసన ఉండదు. దీనివల్ల వాతావరణంలోని ఓజోన్ పొరకు హాని జరుగుతుందని గుర్తించారు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఫ్రియాన్ వినియోగాన్ని తగ్గించేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
కేరళలోని కొచ్చిన్లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం ఉదయం శిశువుకు జన్మనిచ్చింది. -
వీఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. -
దిగుతుండగా కూలిన హెలికాప్టర్
శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. -
దిల్లీ మద్యం విధానం కేసులో మరో అరెస్టు
దిల్లీ మద్యం విధానంతో ముడిపడిన నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా వినోద్ చౌహాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. -
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాలి
మహిళల పట్ల క్రూరత్వ చర్యలను అడ్డుకొనే లక్ష్యంతో భారతీయ న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సహనమే వివాహబంధానికి పునాది
పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని సుప్రీంకోర్టు పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో... స్వర్గంలో నిర్ణయమైనదిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని హితవు పలికింది. -
కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం
దేశ రాజధానిలో ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
‘ రాహుల్గాంధీ’ పేరుందని పోటీ వద్దంటే ఎలా?
ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై పిటిషన్ను కొట్టేసిన దిల్లీ హైకోర్టు
మద్యం విధానం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. -
రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వండి
పార్కులో ఉదయపు నడకకు వెళ్లిన వ్యక్తి.. వీధి కుక్కల దాడిలో గాయపడి మరణించిన ఘటనలో బాధితుడి కుటుంబసభ్యులకు రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. -
ఛత్తీస్గఢ్లో చెట్టును ఢీకొన్న బీఎస్ఎఫ్ సిబ్బంది బస్సు
ఛత్తీస్గఢ్లో సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ బస్సు నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 17 మంది సిబ్బంది గాయపడ్డారు. -
వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు
వివాహితులైన భార్యాభర్తల మధ్యే శారీరక సంబంధాలు ఉండాలన్నది సమాజం నిర్ణయించుకున్న ఆదర్శ నియమమని దిల్లీ హైకోర్టు తెలిపింది. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక ఆరోపణలు
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు అక్కడి రాజ్భవన్లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానిక హరే స్ట్రీట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
దక్షిణ భారత్ దిశగా రాకాసి కెరటాలు..
లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, దక్షిణ తమిళనాడు రాష్ట్రాల వైపు రాకాసి కెరటాలు తరుముకొస్తున్నాయని.. రెండు రోజుల పాటు సముద్రం ఉగ్రరూపం దాల్చనుందని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం (ఇన్కాయిస్) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. -
దేశీయ బాంబర్ డ్రోన్ ఎఫ్డబ్ల్యూడీ-200బి సిద్ధం
రక్షణశాఖ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో బాంబర్ డ్రోన్ను తయారు చేసినట్లు ఫ్లయింగ్ వెడ్జ్ సంస్థ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు (7)
మహాత్మాగాంధీ ‘కపటి’ అని గుజరాత్ కాంగ్రెస్ నేత, రాజ్కోట్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్గురు వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆయన కంటే రాహుల్గాంధీ మెరుగని పేర్కొన్నారు. -
ఖైదీ కడుపులో సెల్ఫోన్
కర్ణాటకలోని శివమొగ్గ కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న పరశురామ్ అనే ఖైదీ సెల్ఫోన్ మింగేశాడు. తనకు కడుపునొప్పి వస్తోందని నెల రోజులుగా జైలు అధికారులకు చెప్పగా.. స్థానిక ప్రభుత్వ మెగ్గాన్ ఆసుపత్రికి తరలించారు. -
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
హసనకు చెందిన జేడీఎస్ మహిళ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్పై అత్యాచారం కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!