ఆత్మలతో మాట్లాడేందుకు ఇల్లొదిలి పోయింది!

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల అనుష్క రెండు నెలల క్రితం అదృశ్యమైంది. ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్న తల్లిదండ్రులు ‘షామనిజం’పై ఉన్న ఆసక్తితోనే తను ఇంట్లోంచి వెళ్లిపోయిందని

Updated : 01 Jan 2022 07:02 IST

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల అనుష్క రెండు నెలల క్రితం అదృశ్యమైంది. ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్న తల్లిదండ్రులు ‘షామనిజం’పై ఉన్న ఆసక్తితోనే తను ఇంట్లోంచి వెళ్లిపోయిందని భావిస్తున్నారు. కళ్లకు కనిపించని వాటిపై నమ్మకం పెంచుకోవడాన్ని షామనిజం అంటారు. దీనికి ప్రభావితమైనవారు.. పూర్వీకుల ఆత్మలతో మాట్లాడుతున్నట్టు ప్రవర్తిస్తుంటారు. అనుష్కకూ దీనిపై ఆసక్తి ఉండేదని ఆమె తల్లి వెల్లడించారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయే ఒకరోజు ముందు  ఆమెకు చాలా నచ్చజెప్పామని, తననెవరూ అర్థం చేసుకోరంటూ అరిచిందని తల్లి అర్చన కన్నీటిపర్యంతం అవుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేకబృందం ఆమె కోసం గాలిస్తోంది. మరోవైపు.. అనుష్క తండ్రి అభిషేక్‌ సామాజిక మాధ్యమాలు వేదికగా కుమార్తె వివరాలు షేర్‌ చేసి, ఆరాలు తీస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని