
నదిలో పడిన సైనిక వాహనం
ఏడుగురు జవాన్ల మృతి
19 మందికి గాయాలు
లద్దాఖ్లో ఘోర ప్రమాదం
దిల్లీ: సైనికులు ప్రయాణిస్తున్న వాహనం లద్దాఖ్లో పెను ప్రమాదానికి గురైంది. ఏడుగురు మృతి చెందగా 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో లద్దాఖ్లోని టుర్టుక్ సెక్టార్లో ఈ దుర్ఘటన జరిగింది. సైనిక వాహనం ఘాట్ రోడ్డు మీద నుంచి వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపోయి షియోక్ నదిలో పడిపోయింది. రోడ్డు నుంచి దాదాపు 60 అడుగుల లోతుకు వాహనం దొర్లిపోయిందని సైనికాధికారులు తెలిపారు. ఆ సమయంలో మొత్తం 26 మంది వాహనంలో ఉన్నారు. వారంతా పార్తాపుర్ శిబిరం నుంచి సరిహద్దుకు సమీపంలోని హనీఫ్ ప్రాంతానికి వెళ్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ప్రమాద స్థలానికి వెళ్లి క్షతగాత్రులందరినీ తొలుత పార్తాపుర్లోని 403 ఫీల్డ్ ఆసుపత్రికి తరలించాయి. ఏడుగురు సైనికులు మృతి చెందినట్లు అక్కడ ప్రకటించారు. గాయపడిన 19 మందిని మెరుగైన వైద్యం కోసం హరియాణాలోని పంచకుల జిల్లా చండీమందిర్లోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
సైనికుల మృతిపై రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్ చేశారు. బాధితులందరికీ తగిన సహాయం చేస్తామన్నారు. ప్రమాద ఘటన గురించి రాజ్నాథ్ సింగ్కు సైన్యాధిపతి జనరల్ మనోజ్పాండే వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
NIA: హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు
-
India News
Bullet Train: భారత్లో బుల్లెట్ రైలు ఎప్పుడొస్తుంది..? మరింత ఆలస్యమేనా..?
-
Movies News
Shruti Haasan: ఆ వార్తలు నిజం కాదు.. శ్రుతిహాసన్
-
India News
Indian Navy: ‘అగ్నిపథ్’ మొదటి బ్యాచ్.. 20 శాతం వరకు మహిళలే..!
-
Politics News
Sanjay Raut: మధ్యంతర ఎన్నికలొస్తే.. 100కి పైగా సీట్లు మావే: రౌత్ కీలక వ్యాఖ్యలు
-
World News
Snake Island: స్నేక్ ఐలాండ్పై ఎగిరిన ఉక్రెయిన్ పతాకం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్పై శోభు యార్లగడ్డ ఫైర్
- PV Sindhu: ‘రిఫరీ తప్పిదం’తో సింధూకు అన్యాయం.. క్షమాపణలు చెప్పిన కమిటీ
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
- Shruti Haasan: ఆ వార్తలు నిజం కాదు.. శ్రుతిహాసన్
- IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
- Jharkhand: బీటెక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. IAS అధికారి అరెస్టు
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Social Look: టాంజానియాలో అల్లు అర్జున్ ఫ్యామిలీ.. ముంబయిలో తమన్నా జర్నీ!