Rahul Gandhi: గ్రనేడ్ దాడి జరిగే ప్రమాదం.. అందుకే రాహుల్ కాన్వాయ్ని అడ్డుకున్నాం..!
Manipur violence: జాతుల మధ్య వైరంతో నలిగిపోతున్న మణిపుర్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలతో మాట్లాడతారు.
ఇంఫాల్: దాదాపు రెండు నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపుర్(Manipur) ఉద్రిక్తంగా ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడకు వెళ్లారు. రాజధాని నగరం ఇంఫాల్ నుంచి ఘర్షణలకు కేంద్రబిందువైన చురాచాంద్పుర్కు బయలుదేరిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. గ్రనేడ్ దాడి జరిగే ప్రమాదం ఉందన్న అనుమానంతో తాము కాన్వాయ్ను ఆపివేశామని పోలీసులు వెల్లడించారు. (Manipur violence)
‘చురాచాంద్పుర్ జిల్లాకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) వెళ్లాలనుకున్న మార్గంలో గ్రనేడ్ల దాడి జరిగే ముప్పు ఉంది. అందుకే మేం ఆయన్ను అడ్డుకున్నాం. హెలికాప్టర్లో వెళ్లాలని సూచించాం’ అని బిష్ణుపుర్కు చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దాంతో ఇంఫాల్కు చేరుకున్న ఆయన హెలికాప్టర్లో ఆ జిల్లాకు బయలుదేరారు. అనంతరం అక్కడ సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలతో మాట్లాడతారు.
రాహుల్ను అడ్డుకోవడంపై కాంగ్రెస్(Congress) విమర్శలు గుప్పించింది. ‘రాహుల్ను స్వాగతించేందుకు ప్రజలు రోడ్లపైకి వచ్చారు. కానీ బిష్ణుపుర్ పోలీసు ఉన్నతాధికారులు, ఇతర పోలీసులు రోడ్లను దిగ్బంధించారు. ఈ మేరకు వారికి ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వచ్చాయని నాకు తెలిసింది. వారు రాహుల్ పర్యటనను రాజకీయం చేస్తున్నారు’అని మణిపుర్ కాంగ్రెస్ చీఫ్ కె. మేఘచంద్ర ఆరోపించారు.
‘రెండు నెలలుగా మణిపుర్ భగ్గుమంటోంది. దానిపై ప్రధాని మోదీ ఏమాత్రం బాధపడటం లేదు. 130 మంది మరణించారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా రాహుల్ మణిపుర్ వెళ్లారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, భాజపా ఆయన్ను ఎందుకు అడ్డుకుంటున్నాయి..?’అని కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి సుప్రియా శ్రినెట్ ప్రశ్నించారు. ఈ కష్ట సమయంలో ప్రజల కన్నీరు తుడిచేందుకు, వారికి అండగా నిలబడేందుకు రాహుల్ మణిపుర్ వెళ్లారని అన్నారు. ఇదిలా ఉంటే.. అక్కడ ప్రజలు కొందరు రాహుల్కు మద్దతుగా నినాదాలు చేయగా, మరికొందరేమో ఆయన రాకను నిరసించారు. రాహుల్-బాధ్యతాయుతమైన ప్రవర్తన ఒకే దగ్గర ఉండవని, ప్రస్తుత మణిపుర్ పరిస్థితికి కాంగ్రెస్ పాలనే కారణమని భాజపా ఆరోపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్..
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.