April 28th: టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
ఏప్రిల్ 28న విడుదలై, ఘన విజయం అందుకున్న టాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా..
ఇంటర్నెట్ డెస్క్: ఏప్రిల్ 28 (April 28th).. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చరిత్ర లిఖించిన రోజు. టాలీవుడ్లో సరికొత్త రికార్డులు సృష్టించిన సినిమాలు ఆ తేదీనే విడుదలయ్యాయి. అందుకే అది సినీ ప్రియులకు ఎంతో ప్రత్యేకమైంది. ఈ తేదీన ఏయే చిత్రాలు విడుదలై, బ్లాక్బస్టర్లుగా నిలిచాయో గుర్తుచేసుకుందాం..
1977లో ప్రారంభం..
‘అడవి రాముడు’ (Adavi Ramudu) సినిమాతో 1977లోనే ఏప్రిల్ 28 స్పెషల్గా నిలిచింది. నందమూరి తారకరామారావు హీరోగా దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రమిది. అప్పటి వరకు సాంఘిక, పౌరాణిక తదితర నేపథ్యాలే ఎక్కువగా కనిపించిన తెలుగు తెరకు అసలైన కమర్షియల్ హంగులు చూపింది ఈ చిత్రమే. అప్పట్లోనే రూ.3 కోట్లు కలెక్ట్ చేసిన తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. 32 కేంద్రాల్లో 100 రోజులు, 16 కేంద్రాల్లో 175 రోజులు, 8 కేంద్రాల్లో 200 రోజులు, విజయవాడలోని అప్సర థియేటర్లో 302 రోజులు ప్రదర్శితమైందని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.
కమెడియన్.. హీరోగా..
కమెడియన్ అలీ హీరోగా డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి చేసిన ప్రయోగం.. ‘యమలీల’ (Yamaleela). 1994 ఏప్రిల్ 28న వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. తల్లీకొడుకుల సెంటిమెంట్కు ఫాంటసీ నేపథ్యాన్ని జోడించి కృష్ణారెడ్డి అప్పట్లో ట్రెండ్ సెట్ చేశారు. ప్రముఖ హీరో కృష్ణ (దివంగత) అతిథిగా మెరిసిన ఈ సినిమా 100 రోజులకుపైగా దిగ్విజయంగా ఆడింది. హైదరాబాద్లోని పలు థియేటర్లలో 400 రోజులు ప్రదర్శితమైందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
అదిరింది ట్విస్టు.. సినిమా సూపర్హిట్
‘పోకిరి’ (Pokiri) విడుదలతో ఏప్రిల్ 28కు మరింత గుర్తింపు దక్కింది. ప్రముఖ హీరో మహేశ్బాబు (Mahesh Babu), దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా ఎవరూ ఊహించని ప్రభంజనం సృష్టించింది. 2006లో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.66 కోట్ల వసూళ్లతో టాలీవుడ్లో ఉన్న నాటి రికార్డులను తిరగరాసింది. సుమారు రూ.12 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి, ఆ స్థాయి వసూళ్లు చేయడం అప్పట్లో సంచలనం. 200 సెంటర్లలో 100 రోజులు, 63 సెంటర్లలో 175రోజులు, 15 సెంటర్లలో 200రోజులు, కర్నూలులోని ఓ థియేటర్లో సంవత్సరానికిపైగా ప్రదర్శితమైందనేది సినీ వర్గాల మాట. ‘పోకిరి’కి ముందు.. తర్వాత అని తెలుగు చలన చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుకునేలా చేసింది.
‘పోకిరి’ గురించి ఆసక్తికర విశేషాల కోసం క్లిక్ చేయండి..
ఆ ప్రశ్నకు సమాధానం ఈ రోజే..
‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’.. యావత్ సినీ అభిమానుల ప్రశ్నకు ‘బాహుబలి 2’ (Baahubali 2) సమాధానమిచ్చింది ఏప్రిల్ 28నే. ప్రభాస్, రానా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెకెక్కించిన ఈ సీక్వెల్ (బాహుబలి 1కి).. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి, సుమారు రూ. 1800 కోట్లు వసూళ్లు చేసి నయా రికార్డు సృష్టించింది. 2017లో ఈ చిత్రం విడుదలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నంద్యాల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్
ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే నంద్యాల వెళ్లానని సినీ నటుడు అల్లు అర్జున్ తెలిపారు. -
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విశేషాలివీ.. -
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
తాను పాల్గొన్న ఓ కార్యక్రమంలో పెళ్లి ప్రస్తావన రాగా సోనాక్షి సిన్హా స్పందించారు. -
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
తన ఫ్యాషన్ గురించి ఓ నెటిజన్ జాన్వీని ప్రశ్నించగా ఆమె స్పందించారు. -
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైనదే అంటూ ‘సర్కార్’లో ఓటు ప్రాధాన్యం గురించి విజయ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. -
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
trinayani serial actress died: బుల్లితెర నటి పవిత్రా జయరాం మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు -
ఒక్క రోజేంటి?.. ఈ జీవితమే అమ్మది: చిరంజీవి
మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ తారలు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్లు పెట్టారు. -
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
సోషల్మీడియా వేదికగా సినీతారలు పంచుకున్న తాజా అప్డేట్లు మీకోసం.. -
ఆ సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగాను: రిచా చద్దా
‘హీరామండి’లో ఒక సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగినట్లు రిచా చద్దా తెలిపారు. -
నాకు కాబోయే వాడు ఇలా ఉండాలి: కృతి సనన్
తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కృతి సనన్ వివరించారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అందుకే సెల్ఫీ అడిగితే పారిపోతా: ఫహద్ ఫాజిల్
ఎవరైనా సెల్ఫీ అడిగితే తాను పారిపోతానని నటుడు ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. -
‘హీరామండి’ షూటింగ్లో డిప్రెషన్లోకి వెళ్లా: మనీషా కొయిరాల
‘హిరామండి’ షూటింగ్ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లినట్లు మనీషా కొయిరాల తెలిపారు. -
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
విజయ్ దేవరకొండ-రష్మిక జోడి మరోసారి స్క్రీన్పై మెరవనున్నట్లు తెలుస్తోంది. -
27 ఏళ్లలో బాలీవుడ్ నుంచి ఒక్క అవకాశం రాలేదు: జ్యోతిక
తన తొలి చిత్రం ప్రేక్షకాదరణ పొందని కారణంగా 27 ఏళ్లు బాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదని జ్యోతిక అన్నారు. -
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
చిరంజీవి, ఉపాసనకు మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. -
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సంయుక్త. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కొత్త ప్రతిభ ఎంతైనా అవసరం: మురళీ మోహన్
చిత్ర పరిశ్రమలోకి కొత్త ప్రతిభ రావాల్సిన అవసరం ఉందని నటుడు మురళీ మోహన్ అన్నారు. -
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమా మే 10న విడుదల కానుంది. -
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.