Murali Mohan: కొత్త ప్రతిభ ఎంతైనా అవసరం: మురళీ మోహన్‌

చిత్ర పరిశ్రమలోకి కొత్త ప్రతిభ రావాల్సిన అవసరం ఉందని నటుడు మురళీ మోహన్‌ అన్నారు.

Published : 09 May 2024 22:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్: చిత్ర పరిశ్రమలో కొత్త ప్రతిభ ఇంకా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ (Murali Mohan) అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పలువురు ఇండస్ట్రీలోకి వచ్చి, తమని తాము నిరూపించుకున్నారని అన్నారు. ‘రామ జన్మభూమి’ (Rama Janma Bhoomi) సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగింది. మన సినిమాలు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయో, విడుదలవుతున్నాయో తెలుసుకునేందుకు హిందీ వాళ్లూ ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా బాగుంటే హక్కులు కొనుగోలు చేసేందుకు, అవకాశం వస్తే ఏదైనా పాత్రలో నటించేందుకు బాలీవుడ్‌ వాళ్లు ముందుకొస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో సక్సెస్‌ మరింత పెరిగే అవకాశం ఉంది’’ అని అన్నారు. దర్శకుడు వి. సముద్ర మళ్లీ ఫామ్‌లోకి వచ్చారని, ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. నూతన నటులతో సముద్ర తెరకెక్కించిన చిత్రమే ‘రామజన్మభూమి’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు