NTR: ఇటుక ఇటుకలో అభిమానం.. ఎన్టీఆర్పై వినూత్న రీతిలో ప్రేమ
హీరో ఎన్టీఆర్కు (NTR) ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ అభిమాని వినూత్న రీతిలో తారక్పై ప్రేమను తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ హీరో ఎన్టీఆర్పై ఉన్న ప్రేమను ఓ వ్యక్తి వినూత్న రీతిలో చాటాడు. తన ఇంటి నిర్మాణంలో ఉపయోగించే ఇటుకలపై ఎన్టీఆర్ పేరు రాయించుకున్నాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కర్నూల్ జిల్లాలోని ఓ ఎన్టీఆర్ అభిమాని కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాడు. దీంతో తన ఇంటి నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఇటుకలను తయారు చేయించుకున్నాడు. ప్రతి ఇటుకపై ఎన్టీఆర్ అని రాయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఎక్స్లో పంచుకున్నాడు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ఆ ఇటుకలను చూసిన వారంతా కొత్త ఆలోచన అని కామెంట్స్ పెడుతున్నారు.
‘స్కంద’ సన్నివేశంపై ట్రోల్స్.. ఫొటోతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రామ్ పోతినేని
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వలో ఎన్టీఆర్ ‘దేవర’ (Devara)లో నటిస్తున్నారు. దీని షూటింగ్ గోవాలో శరవేగంగా జరుగుతోంది. జాన్వీ కపూర్, ఎన్టీఆర్ల మధ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఇందులోని యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ కానున్నాయి. ఈ సన్నివేశాల కోసం కొరటాల శివ హాలీవుడ్ కొరియోగ్రాఫర్లను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. దీంట్లో తారక్ అండర్ వాటర్ ఫైటింగ్ సీన్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. దీని కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారట. ముంబయి నుంచి తీసుకొచ్చిన ట్రైనర్స్తో తారక్కు శిక్షణ ఇప్పించారట. ఇక ఇందులో విలన్గా సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కనిపించనున్నారు. రెండు భాగాలుగా ఇది విడుదల కానుంది. మొదటి పార్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళికి ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నంద్యాల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్
ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే నంద్యాల వెళ్లానని సినీ నటుడు అల్లు అర్జున్ తెలిపారు. -
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విశేషాలివీ.. -
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
తాను పాల్గొన్న ఓ కార్యక్రమంలో పెళ్లి ప్రస్తావన రాగా సోనాక్షి సిన్హా స్పందించారు. -
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
తన ఫ్యాషన్ గురించి ఓ నెటిజన్ జాన్వీని ప్రశ్నించగా ఆమె స్పందించారు. -
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైనదే అంటూ ‘సర్కార్’లో ఓటు ప్రాధాన్యం గురించి విజయ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. -
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
trinayani serial actress died: బుల్లితెర నటి పవిత్రా జయరాం మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు -
ఒక్క రోజేంటి?.. ఈ జీవితమే అమ్మది: చిరంజీవి
మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ తారలు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్లు పెట్టారు. -
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
సోషల్మీడియా వేదికగా సినీతారలు పంచుకున్న తాజా అప్డేట్లు మీకోసం.. -
ఆ సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగాను: రిచా చద్దా
‘హీరామండి’లో ఒక సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగినట్లు రిచా చద్దా తెలిపారు. -
నాకు కాబోయే వాడు ఇలా ఉండాలి: కృతి సనన్
తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కృతి సనన్ వివరించారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అందుకే సెల్ఫీ అడిగితే పారిపోతా: ఫహద్ ఫాజిల్
ఎవరైనా సెల్ఫీ అడిగితే తాను పారిపోతానని నటుడు ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. -
‘హీరామండి’ షూటింగ్లో డిప్రెషన్లోకి వెళ్లా: మనీషా కొయిరాల
‘హిరామండి’ షూటింగ్ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లినట్లు మనీషా కొయిరాల తెలిపారు. -
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
విజయ్ దేవరకొండ-రష్మిక జోడి మరోసారి స్క్రీన్పై మెరవనున్నట్లు తెలుస్తోంది. -
27 ఏళ్లలో బాలీవుడ్ నుంచి ఒక్క అవకాశం రాలేదు: జ్యోతిక
తన తొలి చిత్రం ప్రేక్షకాదరణ పొందని కారణంగా 27 ఏళ్లు బాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదని జ్యోతిక అన్నారు. -
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
చిరంజీవి, ఉపాసనకు మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. -
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సంయుక్త. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కొత్త ప్రతిభ ఎంతైనా అవసరం: మురళీ మోహన్
చిత్ర పరిశ్రమలోకి కొత్త ప్రతిభ రావాల్సిన అవసరం ఉందని నటుడు మురళీ మోహన్ అన్నారు. -
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమా మే 10న విడుదల కానుంది. -
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.