Suresh Babu: ఏపీలో ఆ నిర్ణయం సమంజసం కాదు
‘‘అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమని ఆదుకుంటామని చెబుతూనే ఉన్నాయి. ఆ మాటల్లో ఉన్న ఆ సమన్వయం.. చేతల్లో కనిపించడం లేదు. అది మేము గట్టిగా ప్రయత్నించకపోవడం వల్లనా?....
‘‘అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమని ఆదుకుంటామని చెబుతూనే ఉన్నాయి. ఆ మాటల్లో ఉన్న ఆ సమన్వయం.. చేతల్లో కనిపించడం లేదు. అది మేము గట్టిగా ప్రయత్నించకపోవడం వల్లనా? లేకపోతే వాళ్లు మమ్మల్ని సైడ్ చేస్తున్నారా? అన్నది తెలియడం లేద’’న్నారు నిర్మాత సురేష్బాబు. ఆయన నిర్మాణంలో వెంకటేష్ హీరోగా రూపొందించిన చిత్రం ‘దృశ్యం2’. ఇటీవలే అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు సురేష్బాబు.
‘దృశ్యం 2’ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?
ఈ చిత్ర ఫలితం పట్ల సంతృప్తిగా ఉన్నా. మలయాళ ‘దృశ్యం2’ విడుదల కాక ముందే.. ఆ చిత్ర హక్కులు తీసుకున్నాం. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు సూచించాను. అలా స్క్రిప్ట్ పూర్తి కాగానే చిత్రీకరణ ప్రారంభించి.. త్వరితగతిన పూర్తి చేశాం.
ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇవ్వాలని ముందే నిర్ణయించారా?
పాటలు, ఫైట్లు ఉండే సినిమాల్ని థియేటర్లలో చూస్తే మంచి కిక్ వస్తుంది. ‘దృశ్యం 2’ అలాంటి వాణిజ్య హంగులున్న చిత్రం కాదు. ‘దృశ్యం 2’ని థియేటర్లలో విడుదల చేసినా మంచి రేటింగ్ వచ్చేదే. ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచుల్లోనూ మార్పులొచ్చాయి. ఇంట్లో కూర్చొని సినిమాలు ఆస్వాదించడానికి అలవాటు పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఓటీటీ అయితే ఫైనాన్షియల్గా సేఫ్ అవుతుందనిపించింది.
ఏపీలోని టికెట్ రేట్ల సమస్య... ఓటీటీ వైపు వెళ్లడానికి కారణమైందా?
అది చిన్న సమస్యే. ఏ క్లాస్లో టికెట్ రేటు వంద రూపాయలంటే పర్లేదు. బీ, సీ సెంటర్లలో మరీ రూ.20, రూ.30గా ఉంది. అది అందరికీ నష్టదాయకమే. 2013 - 14లోనే టికెట్ రేటు రూ.40గా ఉంటే.. అదిప్పుడు మరీ రూ.20కి తగ్గించడం సరైన నిర్ణయం కాదు. ఏపీ ప్రభుత్వం పరిశ్రమపై కన్నెర్ర జేసిందా.. లేక ఎక్కడైనా మిస్ కమ్యునికేషన్ జరుగుతుందా? అన్నది తెలియదు కానీ, మరీ అంత తక్కువ రేట్లు పెట్టడమైతే సమంజసం కాదు. దీనిపై ఒక్కో వర్గం వాదన ఒక్కోలా ఉండొచ్చు. తక్కువ ధరల్లో టికెట్ అందించడం వల్ల ప్రజలకు సినిమా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం అనుకోవచ్చు. అలాగే ఓ ఉత్పత్తిని ఎంత ధరకు అమ్ముకోవాలనే హక్కు నిర్మాతకూ ఉంటుంది. వాళ్లూ తమకు నచ్చిన రేటుకు అమ్ముకోవాలనే అనుకుంటారు. ఇందులో ఏది తప్పు.. ఏది ఒప్పు అనేది నిర్ణయించడం కష్టం. 15నెలల్లో కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మాకు చేసింది ఏమీ లేదు. థియేటర్ కరెంట్ బిల్లులు మాఫీ చేయమన్నాం. ఏపీలో మూడు నెలలు చేశారు కానీ, ఆ డబ్బులు మాకు తిరిగి చెల్లించలేదు. థియేటర్ ఓనర్ల గురించి అసలెవరూ పట్టించుకోవడం లేదు.
పరిశ్రమ సమస్యలపై సురేష్బాబు పెద్దగా స్పందించడం లేదని ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి. ఏమంటారు?
ఇప్పుడు మాట్లాడితే ‘తను ఓటీటీకి అమ్ముకుని మాట్లాడుతున్నాడేంట’ని అనుకుంటారు కదా (నవ్వుతూ). నా తర్వాతి ఆరు సినిమాల్లో మూడింటిని ఇప్పటికే ఓటీటీకి అమ్మేశా. నేను పరిశ్రమలోనే పుట్టాను. ఇక్కడే పెరిగా. ఏం చేసినా సినిమా పరిశ్రమ కోసమే చేస్తాను. ఎవరో ఏదో అన్నారని పట్టించుకోను.
అది అన్ని రంగాల్లో ఉంది
‘‘ఏమైనా అంటే బ్లాక్ టికెట్ వ్యవస్థ అంటుంటారు. ఇది 20ఏళ్ల క్రితమూ ఉంది. అదీ ఎక్కడో కొద్ది మంది వ్యక్తులే చేశారు. నచ్చిన వాళ్లే అలా కొనుక్కుని సినిమా చూశారు. అయినా బ్లాక్ టికెట్ వ్యవస్థ.. మహా అయితే రెండు మూడు రోజులు ఉంటుందేమో? ఆ తర్వాత టికెట్ మామూలు ధరకే అమ్ముతారు. నిజానికి ఈ బ్లాక్ మార్కెట్ వ్యవస్థ అన్నది అన్ని రంగాల్లోనూ పాతుకుపోయి ఉంది. దాన్ని హైలైట్ చేయకుండా.. సినిమా వైపే వేలెత్తి చూపడం కరెక్ట్ కాదు’.
పండగల వేళ జనాలు థియేటర్లకు వస్తున్నారని ‘లవ్స్టోరీ’, ‘సూర్యవంశీ’లాంటి చిత్రాలు నిరూపించాయి. అందుకే అందరికీ పండగలపై ఓ భరోసా ఏర్పడింది. ఒకప్పుడు సంక్రాంతికి నాలుగు చిత్రాలు.. నాలుగొందల థియేటర్ల చొప్పున విడుదలయ్యేవి. రెండు రాష్ట్రాల్లోని 1600 థియేటర్లని పంచుకునేవి. ఇప్పుడు ఒక్కో సినిమాకి 1500 స్క్రీన్స్ కావాలని అడుగుతున్నారు. అక్కడే గొడవ రానుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదురుతుందా? లేదా? అన్నది చూడాలి.
సర్ప్రైజ్ అవుతారు
‘‘ఎఫ్ 3’ తుది దశ చిత్రీకరణలో ఉంది. నెట్ఫ్లిక్స్ కోసం చేస్తున్న ‘రానా నాయుడు’ చిత్రీకరణ దశలోనే ఉంది. వీటితో పాటు మరికొన్ని స్క్రిప్ట్లు సిద్ధమవుతున్నాయి. అవి తెలిశాక తప్పకుండా అందరూ సర్ప్రైజ్ అవుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పూజ సరికొత్త ప్రయాణం..
దక్షిణాదితోపాటు.. ఇటు బాలీవుడ్లోనూ ఇప్పటికే తానెంటో నిరూపించుకుంది కథానాయిక పూజా హెగ్డే. గతేడాది ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రంతోనే సరిపెట్టుకున్న ఈ భామ.. ఇప్పుడు ఆ లోటును తీర్చడానికి వరుస సినిమాలతో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. -
రామ్తో వెబ్సిరీస్?
కథానాయకుడు రామ్ త్వరలో ‘డబుల్ ఇస్మార్ట్’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. కానీ, దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. -
తెరపైనా ఫిల్మ్ స్టారే!
‘ఖో గయే హమ్ కహా’తో గతేడాదికి మంచి ముగింపే పలికింది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. ఈ ఏడాది ‘కంట్రోల్’, ‘శంకర’ లాంటి చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె మరో చిత్రంలో కీలక పాత్రలో మెరవనుంది. -
ఇద్దరు నాయికలతో..!
వెంకటేశ్ కొత్త చిత్రం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం కాగా... సంగీతం పనులూ ఊపందుకున్నట్టు తెలుస్తోంది. జులైలో సినిమాని పట్టాలెక్కించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు ప్రచారంలో ఉంది. -
తలపడితే వదలడే.. తన పేరు విజయుడే
‘రాయన్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు కథానాయకుడు ధనుష్. ఇది ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాని ఏషియన్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ తెలుగులో విడుదల చేయనుంది. -
‘డార్లింగ్’ పూర్తయింది
‘డార్లింగ్’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించనుంది నభా నటేష్. ఆమె.. ప్రియదర్శి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. -
మనోహరం... రామనామం
ప్రతి పౌరుడూ రాముడిలా బతకాలని...ధర్మబద్ధంగా మెలగాలని చెప్పే కథతోనే ‘రామ జన్మభూమి’ చిత్రాన్ని తెరకెక్కించినట్టు వి.సముద్ర తెలిపారు. ఆయన దర్శకనిర్మాతగా...జై సిద్ధార్థ్, శ్రీరాధా ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రమిది. -
కేన్స్ చిత్రోత్సవంలో ‘భారత్ పర్వ్’ వేడుక
ఎన్నో ప్రఖ్యాత వేదికలపై ఇప్పటికే మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పింది సినిమా రంగం. ఇప్పుడు తొలిసారి భారతదేశం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘భారత్ పర్వ్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మొదలైంది
అజిత్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. శుక్రవారం నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ ప్రారంభించుకుంది. -
కాండ్రకోట రహస్యం
వరుణ్సందేశ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘నింద’. కాండ్రకోట మిస్టరీ... అనేది ఉపశీర్షిక. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు