Kangana Ranuat: అవును నిజమే.. మహేశ్ని బాలీవుడ్ భరించలేదు: కంగన
బాలీవుడ్ తనని భరించలేదంటూ సూపర్స్టార్ మహేశ్బాబు చేసిన వ్యాఖ్యలపై బీటౌన్ నటి కంగనా రనౌత్ స్పందించారు. సూపర్స్టార్ చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని ఆమె అన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ధకడ్’ మే 20న విడుదల కానుంది...
సూపర్స్టార్ని సపోర్ట్ చేసిన బాలీవుడ్ తార
ముంబయి: బాలీవుడ్ తనని భరించలేదంటూ సూపర్స్టార్ మహేశ్బాబు చేసిన వ్యాఖ్యలపై బీటౌన్ నటి కంగనా రనౌత్ స్పందించారు. సూపర్స్టార్ చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని ఆమె అన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ధకడ్’ మే 20న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం తాజాగా ముంబయిలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంగన మాట్లాడుతూ.. ప్రతి విషయాన్ని వివాదాస్పదంగా చూడాల్సిన అవసరం లేదని.. మహేశ్ మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని కోరారు.
‘‘మహేశ్ మాటల్లో వాస్తవం ఉంది. బాలీవుడ్ నిజంగానే ఆయన్ని భరించలేదు. ఎందుకంటే, ఆయనకు ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్ నుంచి అవకాశాలు వచ్చాయి. కానీ, ఆయన తరం నటీనటులందరూ కలిసి టాలీవుడ్ని భారతదేశంలోనే నంబర్ 1 ఇండస్ట్రీగా మార్చారు. మహేశ్కు తన సొంత ఇండస్ట్రీపై ఎంతో గౌరవం ఉంది. దాన్ని ఎవరూ కాదనలేరు. తన సొంత ఇండస్ట్రీపై ఉన్న గౌరవం, తన అభిమానులపై ఉన్న ప్రేమతోనే ఆయన అలా చెప్పి ఉంటారు. కాబట్టి, ప్రతి విషయాన్ని వివాదాస్పదంగా చూడాల్సిన అవసరం లేదు. అదే విధంగా, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తెలుగు చిత్రపరిశ్రమ ఈ స్థాయికి వచ్చిందనేది అందరూ తప్పకుండా ఒప్పుకోవాల్సిన విషయం. సుమారు 10, 15 ఏళ్ల నుంచి టాలీవుడ్ వాళ్లు ఎంతో కష్టపడుతున్నారు. మనం వాళ్ల నుంచి ఎంతో నేర్చుకోవాలి’’ అని కంగన అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
-
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి