తోడేలులా వరుణ్‌ధావన్‌!

బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘భేదియా’ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. వరుణ్‌  ధావన్‌, కృతిసనన్‌ నటించిన ఈ సినిమాను హారర్‌

Published : 23 Feb 2021 12:38 IST

ముంబయి: బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘భేదియా’ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. వరుణ్‌  ధావన్‌, కృతిసనన్‌ నటించిన ఈ సినిమాను హారర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో వరుణ్‌ధావన్‌  తోడేలులా మారుతున్నట్లు చూపించారు.

ఈ చిత్రం ఏప్రిల్‌ 14న వేసవిలో థియేటర్లకు వస్తోంది. వరుణ్‌ధావన్‌, కృతిసనన్‌ కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది. దీన్ని అమర్‌కౌశిక్‌   తెరకెక్కిస్తున్నారు. ‘ఈ     సంతోషాన్ని అభిమానులతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరో కొత్త చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం’ అంటూ కృతిసనన్‌ పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని