Ashwathama: ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు.
మహాభారతంలోని ఒక పాత్ర అశ్వత్థామ. సప్త చిరంజీవుల్లో (అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు) ఒకడు. ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అశ్వత్థామగా కనిపించనున్నట్లు తెలుపుతూ ఆయన పాత్రను పరిచయం చేసింది. శరీరంపై గాయాలతో, చిరిగిన వస్త్రాలు కట్టుకుని అమితాబ్ కనిపించారు. ఒక షాట్లో యంగ్ అమితాబ్ నుదుటిపై మణి కనిపిస్తుంది. ‘ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నా. ద్రోణాచార్య తనయుడు అశ్వత్థామని..’ అని అమితాబ్ చెప్పడంతో ఇంతకీ ఎవరాయన? అని నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. అసలు ఆ పాత్ర ఏంటి? అతడి శరీరంపై గాయాలు, నుదుటిపై మణి కథేంటి? శ్రీకృష్ణుడు అతనికి ఇచ్చిన శాపం ఏంటి?
ద్రోణుడి కుమారుడు..
పాండవులు, కౌరవులకు గురువైన ద్రోణుని ఏకైక కుమారుడు అశ్వత్థామ. అతడి తల్లి కృపి. ద్రోణుడి తపస్సుకు మెచ్చి, శివుని వరం వల్ల అతడు నుదుటిపై మణితో జన్మిస్తాడు. ఆ మణి ప్రభావం కారణం ఇతర మానవులతో పోలిస్తే, ఆకలి, దప్పుల నుంచి రక్షణ పొందగలడు. అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం సాధిస్తాడు. ఎదుటి వారి ముఖస్తుతికి లొంగిపోయే గుణం కలిగిన అశ్వత్థామ.. మొదటి నుంచి కౌరవుల పక్షాన నిలుస్తాడు. మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది. కదన రంగంలో ఆయనను ఓడించడం పాండవులకు అసాధ్యం. దీంతో ధర్మ పరిరక్షణ కోసం కృష్ణుడు పథకం రచిస్తాడు. జీవితంలో ఎప్పుడూ అసత్యం పలకని ధర్మరాజును పిలిచి ఆయన చనిపోయాడని చెప్పమని కోరతాడు. తొలుత ధర్మరాజు అందుకు ఒప్పుకోడు. కానీ, కృష్ణుడి సూచన మేరకు అబద్ధం ఆడేందుకు సరేనంటాడు. ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ధర్మరాజు ‘అశ్వత్థామ హతః..’ అని గట్టిగా చెప్పి.. ‘కుంజరః’ అని నెమ్మదిగా అంటాడు. తన కుమారుడే మరణించాడనుకుని ద్రోణాచార్యుడు యుద్ధంలో అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదనుగా భావించిన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని చంపేస్తాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో కర్ణ దుర్యోధనాదులు, ఇతర కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టి మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు.
ఉప పాండవులను చంపి...
తండ్రి మరణం, స్నేహితులైన కౌరవులు నశించడం సహించలేకపోయిన అశ్వత్థామ తీవ్ర కోపంతో రగిలిపోతాడు. పాండవులను ఎలాగైనా అంతం చేస్తానని దుర్యోధనుడి మరణానికి ముందు అతడికి మాట ఇస్తాడు. శివుని అనుగ్రహంతో వరం పొంది, ద్రౌపదీ పుత్రులైన ఐదుగురు ఉప పాండవులను (ప్రతివింధ్యుడు, శ్రుతసోముడు, శ్రుతకర్ముడు, శతానీకుడు, శ్రుతసేనుడు) చంపేస్తాడు. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు, పాండవులు అతడిని వెంబడిస్తారు. గురు పుత్రుడన్న కారణంగా చంపకుండా వదిలేస్తారు. అశ్వత్థామ కపటబుద్ధి తెలిసిన శ్రీకృష్ణుడు అతడిని ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా అడ్డుకునేందుకు పాండవులతో కలిసి కౌరవ శిబిరానికి చేరుకొంటాడు. అప్పటికే అతడు వ్యాసాశ్రమానికి వెళ్లడంతో కృష్ణుడు అక్కడికి వెళ్తాడు.
బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం..
కృష్ణుడితో కలిసి వ్యాసాశ్రమానికి వచ్చిన పాండవులను చూసిన అశ్వత్థామ క్రౌర్యంతో రగిలిపోతాడు. కోపంలో విచక్షణ కోల్పోయి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ‘అపాండవీయం అవుగాక’ అని ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర శక్తి వల్ల భూమ్మీద ఉన్న పాండవులు, వారి సంతతి మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. కానీ, దాన్ని అడ్డుకోమని అర్జునుడిని ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అడ్డుకోవాలంటే అదే అస్త్రాన్ని ప్రయోగించాలి. అర్జునుడి తపోశక్తి వల్ల అప్పటికే ఆ అస్త్రాన్ని పొంది ఉండటంతో ‘పాండవులకు క్షేమం చేకూరుగాక’ అని మరోవైపు నుంచి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. రెండూ బ్రహ్మశిరోనామకాస్త్రాలు ఢీకొంటే ప్రళయమే. భూమండలమంతా సర్వనాశనమైపోతుంది. వెంటనే ఈ ఉపద్రవాన్ని గ్రహించిన వ్యాస మహర్షి, నారదుడు పరుగు పరుగున వచ్చి, అస్త్రాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా అర్జునుడిని కోరతారు. పెద్దల సూచన మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. ‘మరి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం మాటేమిటి గురువర్యా’ అని వ్యాసుడిని అర్జునుడు అడగ్గా.. ‘అస్త్రాన్ని ఉపసంహరించు. పాండవులు నిన్ను ఏమీ చేయరు’ అని అశ్వత్థామకు వ్యాసుడు సూచిస్తాడు.
వ్యాసుడి మాటకు గౌరవం ఇస్తున్నట్లు నటిస్తూనే ‘పాండవేయ రాగ గర్భాలు నశించుగా’ అని అతడు తన అస్త్రాన్ని దిశ మారుస్తాడు. దాని ప్రకారం.. పాండవుల భార్యలు, కోడళ్లు గర్భాలను ఆ అస్త్రం విచ్చిన్నం చేస్తుంది. అప్పుడు ఉత్తర ఒక్కతే గర్భంతో ఉండటంతో ఆమె గర్భం విచ్ఛినమవుతుంది. అశ్వత్థామ కుటిల బుద్ధికి కోపోద్రిక్తుడైన శ్రీకృష్ణుడు అతడి తలపై ఉన్న సహజ మణిని తీసి శపిస్తాడు. ‘ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో, ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమ్మీదే తిరుగు’ అని పేర్కొంటాడు. బ్రహ్మాశిరోనామకాస్త్ర ప్రయోగం వల్ల ఉత్తర గర్భంలో మరణించిన శిశువును కృష్ణుడు తన యోగమాయతో ప్రాణంపోసి బతికిస్తాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరినీ పరీక్షగా చూస్తుండటంతో అతడికి పరీక్షిత్ అని పేరు పెడతారు. బ్రాహ్మాణుడు, అన్ని విద్యలలో సుశిక్షితుడు అయిన అశ్వత్థామ రాగద్వేషాలు, బంధుప్రీతి కారణంగా క్రోధం, మూర్ఖత్వాలకు లోనై శాపగ్రస్తుడయ్యాడు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ గుణపాఠం.
ఇక ‘కల్కి’లో అమితాబ్ అశ్వత్థామగా కనిపిస్తుండటంతో ఆ పాత్రపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ద్వాపరయుగం నుంచి అశ్వత్థామ ఎందుకు శ్రీమహా విష్ణువు పదో అవతారం కోసం ఎదురు చూస్తున్నాడు? అతడికి శాప విమోచనం అవుతుందా? తిరిగి ఆ సహజమణి అతడికి చేరుతుందా? భైరవ (ప్రభాస్)కు అతడు సాయం చేస్తాడా? లేక పోరాడతాడా? వంటి ప్రశ్నలకు ‘కల్కి’లో సమాధానం దొరికే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో దీపికా పదుకొణె, కమల్హాసన్, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై ఈ చిత్రం రూ.600 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతోంది. విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వీళ్ల నాన్న ఎంత మంచి నటుడో.. ఇతనంత వేస్ట్ఫెలో’ అన్నారు: సూర్య జర్నీ ఇదే..!
ప్రముఖ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.. -
హీరోయిన్ల జోరు.. జాన్వీ, భాగ్యశ్రీ అలా.. మీనాక్షి, ప్రియాంక ఇలా!
వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లపై ప్రత్యేక కథనం. -
‘ఆలస్యమైందా ఆచార్య పుత్రా’.. ఇవి కదా ప్రభాస్ కటౌట్కు అదిరిపోయే సీన్స్
సినిమా మొత్తం ఒక ఎత్తయితే, ప్రభాస్ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఇచ్చి, థియేటర్ దద్దరిల్లిపోయేలా చేశారు కొందరు దర్శకులు.. ఆ సినిమాలు ఏంటి? ఆ సీన్స్ ఏంటి? -
‘హనుమాన్’తో మొదలై.. ‘కల్కి’తో ముగిసి: టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్టు
2024లో విడుదలైన (జనవరి నుంచి జూన్ వరకు) తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ సినిమా హిట్, ఏది ఫట్ అంటే? -
అప్పుడు భయపడి.. ఇప్పుడు సినీ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకొని!
‘కల్కి 2898 ఏడీ’ గురువారం విడుదల కాబోతున్న సందర్భంగా హీరో ప్రభాస్ కెరీర్పై ప్రత్యేక కథనం.. -
రూ. 4 వేల జీతం నుంచి రూ. 600 కోట్ల ‘కల్కి’ వరకు.. నాగ్ అశ్విన్ జర్నీ ఇదీ
‘సాధారణంగా కనిపించే చాలామంది వ్యక్తుల్లో అసాధారణ ప్రతిభ ఉంటుంది’.. దర్శకుడు నాగ్ అశ్విన్ను ఉద్దేశిస్తూ నటుడు కమల్ హాసన్ చెప్పిన మాటలివి. -
ఎన్టీఆర్ పెట్టిన పేరు.. భారీ చిత్రాలకు మారుపేరు ‘వైజయంతీ మూవీస్’
Vyjayanthi Movies: భారీ అంచనాల మధ్య ప్రభాస్, నాగ్ అశ్విన్ల ‘కల్కి 2898 ఏడీ’ విడుదలవుతున్న నేపథ్యంలో ఆ సినిమాను నిర్మించిన ‘వైజయంతీ మూవీస్’ గురించి ఆసక్తికర విషయాలు.. -
ఆ తెలుగు చిత్రంలో నటించారు కానీ: దీపికా పదుకొణె గురించి మీకివి తెలుసా?
దీపికా పదుకొణె ఓ ప్రధాన పాత్ర పోషించిన ‘కల్కి 2898 ఏడీ’ గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె గురించి ప్రత్యేక కథనం.. -
‘కల్కి’లో ప్రభాస్, కమల్హాసన్ పాత్రలకు పురాణాల రిఫరెన్స్ అదేనా?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో పాత్రలు, వాటిని ఎక్కడినుంచి తీసుకున్నారో తెలుసా? -
‘కల్కి’ ఎవరు? ఆ అవతారం ఎప్పుడు వస్తుంది?సినిమాలో ఏం చూపించబోతున్నారు?
నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో అసలు ‘కల్కి’ అవతారం.. దాని విశేషాలు తెలుసుకుందాం. -
‘కల్కి 2898 ఏడీ’లో మలయాళ నటి.. ఎవరీ అన్నా బెన్?
‘కల్కి 2898 ఏడీ’లో కీలక పాత్ర పోషించిన అన్నా బెన్ గురించి పలు ఆసక్తికర విషయాలు.. -
కథను.. కళను నమ్మిన సంస్థే ‘ఉషా కిరణ్’.. సినీ రంగంలో రామోజీ ప్రస్థానమిది
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు నేడు తుదిశ్వాస విడిచారు. జర్నలిజం రంగంలోనే కాకుండా సినీ రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయన నిర్మించిన ఉషా కిరణ్ మూవీస్ ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం. -
భారీ టైర్లు.. ఆరు టన్నుల బరువు.. ‘కల్కి’లో ‘బుజ్జి’ కారు విశేషాలు తెలుసా?
kalki 2898 ad: కల్కిలో బుజ్జిగా కీలక పాత్ర పోషిస్తున్న కారు గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. -
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు.. -
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
వేర్వేరు సంవత్సరాల్లో మే 9న విడుదలై మంచి విజయాలు అందుకున్న సినిమాలపై ప్రత్యేక కథనం. అవేంటో చూసేయండి.. -
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
సంచలనానికి 50 ఏళ్లు.. ‘అల్లూరి సీతారామరాజు’ తెర వెనక ఎన్ని విశేషాలో..!
‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా గురించి ప్రత్యేక కథనం. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు