‘మహారాష్ర్ట సర్కారు స్వయంగా కూలిపోతుంది’
మహారాష్ర్టలో అధికారంలో ఉన్న శివసేన ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని మాజీ సీఎం, భాజపా సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. ఆ రాష్ర్టంలో అధికారం కోసం భాజపా ప్రయత్నం చేయటం లేదని
శివసేన ప్రభుత్వంపై మాజీ సీఎం వ్యాఖ్య
ముంబయి : మహారాష్ర్టలో అధికారంలో ఉన్న శివసేన సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని మాజీ సీఎం, భాజపా సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ జోస్యం చెప్పారు. ఆ రాష్ర్టంలో అధికారం కోసం భాజపా ప్రయత్నం చేయటం లేదని ఆయన వివరించారు. బిహార్ ఎన్నికల ఫలితాలు భాజపాకు సానుకూలంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రభావం మహారాష్ర్ట రాజకీయాల్లో ఏ విధంగా ఉంటుందనే మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు.
‘ఇలాంటి ప్రభుత్వం(శివసేన) చాలా కాలం అధికారంలో ఉండలేదు. మహారాష్ర్టలో సర్కారు ఎప్పడు కూలిపోతే అప్పుడు మేము ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ విషయాన్ని ఆలోచించడం లేదన్నారు. అధికారంలో ఉన్న ఉద్దవ్ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. వాళ్లకు కావాల్సిన ఆర్థిక అవసరాలను తీర్చడంలో సర్కారు విఫలమైందని ఆయన విమర్శలు చేశారు. మహారాష్ర్టలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని ఫడణవీస్ పేర్కొన్నారు. బిహార్లో ఎన్డీయేకు అనుకూలంగా వచ్చిన ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రభావితం చూపుతాయని ఆయన చెప్పారు. దీంతో పాటు వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాజా ఎన్నికల ప్రభావం ఉంటుందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్