ఆలూ కృత్రిమ కొరత వెనుక తృణమూల్: భాజపా
పశ్చిమబెంగాల్లో బంగాళాదుంపల(ఆలూ) కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, దీని వెనుక తృణమూల్ కాంగ్రెస్ హస్తం ఉందని భాజపా ఆరోపించింది. అకస్మాత్తుగా బంగాళా దుంపల ..........
కోల్కతా: పశ్చిమబెంగాల్లో బంగాళాదుంపల(ఆలూ) కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, దీని వెనుక తృణమూల్ కాంగ్రెస్ హస్తం ఉందని భాజపా ఆరోపించింది. అకస్మాత్తుగా బంగాళా దుంపల ధరలు పెరగడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం కిలో బంగాళా దుంపల ధర రూ.40లుగా ఉందని, సామాన్యుడికి ఎంతో కష్టంగా మారిందని , వారి జేబులకు చిల్లుపెట్టేదిగా ఉందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బంగాళా దుంపల ధరలు ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. అధికార పార్టీ పెంచి పోషిస్తున్న వారే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వంపై ఆ పార్టీకి చెందిన సభ్యులే అసంతృప్తితో ఉన్నారన్నారు. 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే)ను నియమించుకోవడాన్ని కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారన్నారు. పీకే హఠావో.. టీఎంసీ బచావో వంటి నానాదాలు చేస్తున్నారని దిలీప్ ఘోష్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!