TSPSC పేపర్‌ లీకేజీ: గన్‌పార్కు వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్‌, ఈటల అరెస్టు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గన్‌పార్కు వద్దకు దీక్షకు దిగారు. అనంతరం టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి బయల్దేరిన సంజయ్‌ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Updated : 17 Mar 2023 14:22 IST

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) పేపర్‌ లీకేజీ అంశంపై గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay) దీక్షకు దిగారు. అయితే, ఈ దీక్షకు అనుమతి లేదని తొలుత పోలీసులు తెలిపారు. అయినప్పటికీ దీక్ష చేపట్టడంతో పోలీసులు, బండి సంజయ్‌ మధ్య కాసేపు చర్చలు జరిగాయి. అనంతరం పోలీసులు కాస్త వెనక్కి తగ్గడంతో సంజయ్‌ దీక్ష కొనసాగించారు.

అనంతరం దీక్ష ముగించే సమయంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్తామని సంజయ్‌ ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గన్‌పార్కు నుంచి టీఎస్‌పీఎస్సీకి బయలుదేరిన భాజపా నేతలను, బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తర్వాత బండి సంజయ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు అరెస్టు చేసి వాహనంలో తరలించారు.

తొలుత బండి సంజయ్‌ పార్టీ కార్యాలయం నుంచి గన్‌పార్కుకు పాదయాత్ర చేపట్టారు. సంజయ్‌తోపాటు పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆయనకు మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై త్వరగా విచారణ చేపట్టాలని ఆందోళనకు దిగారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని