బెంగాల్లో భాజపాకు మరో షాక్.. సొంతగూటికి మాజీ మంత్రి!
పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి మరో షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ముందు భాజపాలో చేరిన నేతలంతా మళ్లీ సొంతగూటికి పయనమవుతున్నారు. తాజాగా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రాజీవ్ బెనర్జీ భాజపాను వీడి తృణమూల్ కాంగ్రెస్లో చేరారు.
అగర్తల: పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి మరో షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ముందు భాజపాలో చేరిన నేతలంతా మళ్లీ సొంతగూటికి పయనమవుతున్నారు. తాజాగా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రాజీవ్ బెనర్జీ భాజపాను వీడి తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. త్రిపుర రాజధాని అగర్తలలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు రాజీవ్ బెనర్జీ తృణమూల్ను వీడి భాజపాలో చేరారు. ఇటీవలే ఆయనకు భాజపా జాతీయ కార్యవర్గంలో సైతం చోటు కల్పించారు. అయితే, ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన భాజపా కార్యక్రమాల్లో పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అప్పట్లో భాజపాలో చేరొద్దని దీదీ వారించినా తాను వినలేదని సొంతగూటికి చేరిన సందర్భంగా రాజీవ్ పేర్కొన్నారు. ఆమె మాట వినకుండా ఆ పార్టీలో చేరినందుకు ఇప్పుడు పశ్చాత్తాపం చెందానని చెప్పారు. భాజపా విభజన రాజకీయాలు, విద్వేష రాజకీయాల్లో తాను ఇమడలేనని గ్రహించానన్నారు. మమతా బెనర్జీపై వ్యక్తిగత దూషణలకు దిగొద్దని పలుమార్లు భాజపా అధినాయకత్వానికి సూచించినా తన మాట వినలేదని చెప్పారు. చిన్నపాటి అపార్థం వల్లే అప్పట్లో తాను పార్టీ వీడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు