Chandrababu: వాజ్‌పేయీకి నివాళులర్పించిన తెదేపా అధినేత చంద్రబాబు

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు.

Updated : 25 Dec 2023 15:03 IST

అమరావతి: మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయీది రాజకీయాలకు అతీతంగా కీర్తించే వ్యక్తిత్వమని కొనియాడారు. ఆయనతో గడిపిన ప్రతిక్షణం నేర్చుకోవడానికి గొప్ప అవకాశమిచ్చిందన్నారు.

వాజ్‌పేయీ కల సాకారం కాబోతోంది: కిషన్‌రెడ్డి

అయోధ్యలో రామమందిరం నిర్మించాలని వాజ్‌పేయీ ఆకాంక్షించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ హయాంలో ఆయన కల సాకారం కాబోతోందని హర్షం వ్యక్తం చేశారు. వాజ్‌పేయీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాజ్‌పేయీ జయంతిని సుశాసన్‌ దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని