ఆ రైతులను నమ్మించి గొంతుకోశారు: పవన్
రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్రం ఇష్టమేననీ.. ఆ విషయంతో తానూ ఏకీభవిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కానీ, ...
రాయపూడి: రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్రం ఇష్టమేననీ.. ఆ విషయంతో తానూ ఏకీభవిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కానీ, అమరావతినే రాజధానిగా గతంలో అందరూ అంగీకరించి.. ఇప్పుడు మార్చడం సరికాదన్నారు. ఇష్టానుసారం నిర్ణయాలను మార్చుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని రైతులను సీఎం జగన్మోహన్ రెడ్డి నమ్మించి గొంతు కోశారని మండిపడ్డారు. రాజధాని అమరావతిలోనే ఉండేలా పోరాటం చేస్తానన్నారు. శనివారం ఆయన అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడి రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. ‘‘రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. రాష్ట్ర భవిష్యత్తు కోసమే రైతులు భూములిచ్చారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. రాష్ట్రానికి అమరావతే రాజధాని అని నిర్ణయం తీసేసుకున్నాం. అది అయిపోయింది. ఇప్పుడు మార్చడానికి లేదు. 151 మంది ఎమ్మెల్యేలు మార్చుకుంటాం.. 13 రాజధానులు.. 13 ముక్కలు.. 33 ముక్కలు చేస్తామంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం.. తమ ఇష్టానికి చేసుకోవడం కుదరదు’’ అని వ్యాఖ్యానించారు.
వైకాపా నేతలకు క్విడ్ప్రోకో అలవాటే!
‘‘రాజధాని తరలింపు అంశాన్ని జగన్ ఎన్నికల ముందే చెప్పి ఉండాల్సింది. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన వాళ్లను కావాలంటే శిక్షించండి. ప్రజలను రోడ్లమీదకు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేవి అసలు పార్టీలే కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. నాలుగైదు భవనాలు కట్టినంత మాత్రాన అభివృద్ధి కాదు. వైకాపా నేతలకు క్విడ్ప్రోకో అలవాటే. రైతులు తెదేపాకు భూములు ఇవ్వలేదు.. ప్రభుత్వానికి ఇచ్చారు. రాయలసీమ, ఉత్తరాంధ్రాల సమగ్ర అభివృద్ధిని కోరుకుంటున్నా. ఒక్క కోర్టు వచ్చినంత మాత్రాన అభివృద్ధి జరగదు’’
పెన్ను పోటుతో రాజధాని మార్పు!
‘‘విశాఖలో మళ్లీ భూసమీకరణ చేస్తున్నారు. అక్కడి రైతులు భూసమీకరణను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఇన్ని వేల ఎకరాలు ఉంటే విశాఖలో మళ్లీ భూ సమీకరణ ఎందుకు? ప్రభుత్వం వ్యాపారం చేస్తున్నట్లు ఉంది. వైకాపా నాయకుల నవరత్నాల పందేరానికి భూములు ఇవ్వలేదు. ఇక్కడ చాలా రోజులుగా కులమతాలకతీతంగా రైతులు దీక్షలు చేస్తున్నారు. ఇది కేవలం ఒక సామాజిక వర్గానికి చెందినది కాదు. రైతులు నిజంగా త్యాగం చేసి భూములు ఇచ్చారు. తెదేపాతో మీకు గొడవ ఉంటే వారితో పెట్టుకోండి.. కానీ, రాజధాని మార్పు తగదు. పెన్నుపోటుతో రాజధాని మార్పు చేస్తున్నారు. 40 మందికి పైగా రైతులు చనిపోయారు.. ఇవి ప్రభుత్వ హత్యలే. అహంకారం తలకెక్కి నిర్ణయాలు తీసుకుంటే మంచిది కాదు. అమరావతి రైతుల ఉద్యమానికినా మద్దతు ఎప్పటికీ ఉంటుంది’’ అని పవన్ అన్నారు.
ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్