మధ్యప్రదేశ్ పరిణామాలు.. సుప్రీంకు భాజపా
కేంద్ర మాజీమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్కు రాజీనామా చేసి భాజపాలో చేరడంతో మధ్యప్రదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నాటకీయ పరిణామాల మధ్య కొనసాగుతోంది...........
దిల్లీ: కేంద్ర మాజీమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్కు రాజీనామా చేసి భాజపాలో చేరడంతో మధ్యప్రదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నాటకీయ పరిణామాల మధ్య కొనసాగుతోంది. రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశాల నేపథ్యంలో కమల్నాథ్ ప్రభుత్వానికి సోమవారం బలపరీక్ష జరుగుతుందని అంతా భావించినా అలా జరగకపోవడంపై భాజపా ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 12గంటల సమయం లోపు కమల్నాథ్ ప్రభుత్వం బలపరీక్ష ప్రక్రియను పూర్తిచేసేలా ఆదేశాలు జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంను ఆశ్రయించిన వారిలో భాజపా సీనియర్ నేత శివరాజ్సింగ్ చౌహాన్తో పాటు 10మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనిపై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు, భాజపా నేతలు గవర్నర్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలుస్తున్నట్టు తెలుస్తోంది.
సింధియాకు విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు గుడ్బై చెప్పడంతో కమల్నాథ్ ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు బల పరీక్ష నిర్వహించాలని గవర్నర్ టాండన్ శనివారం రాత్రి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేసిన గవర్నర్.. ఎమ్మెల్యేలందరూ రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని.. ప్రజాస్వామ్యం హుందాతనాన్ని కాపాడేలా వ్యవహరించాలని సూచించారు. కేవలం ఒక్క నిమిషంలోనే తన ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోవడం గమనార్హం. ఆ తర్వాత కరోనా వైరస్ ప్రభావంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రస్తావించగా.. సభను ఈ నెల 26 వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రజాపతి ప్రకటించారు. దీంతో కమల్నాథ్ సర్కార్కు కొంత ఊరట లభించినట్టయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు