లోక్‌సభ స్పీకర్‌తో రాఘురామకృష్ణ రాజు భేటీ 

లోకసభ స్పీకర్ ఓం బిర్లాతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ అయ్యారు. సుమారు 50 నిమిషాల....

Updated : 26 Jun 2020 23:33 IST

దిల్లీ: లోకసభ స్పీకర్ ఓం బిర్లాతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ అయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా రఘురామకృష్ణ రాజు తనకు రక్షణ కల్పించే విషయంపై ప్రధానంగా మాట్లాడినట్లు సమాచారం. భద్రతకు సంబంధించి ఎంపీ ఓఎస్డీతో హోం శాఖకు సమన్వయం చేస్తున్నట్లు రఘురామకృష్ణ రాజుతో స్పీకర్ చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కమిటీ సమావేశాలు, పార్లమెంటు సమావేశాల నిర్వహణపై కూడా ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని