భాజపాను వైకాపాకు తాకట్టు పెట్టారు
‘భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన ఆస్తులను పెంచుకోవడానికి పార్టీని వైకాపాకు తాకట్టు పెట్టారు. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వర్గమనే మమ్మల్ని కార్యవర్గ సమావేశాలకూ పిలవడం లేదు’ అని ఆ పార్టీ పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షుడు కె.సైదారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోము వీర్రాజుపై కన్నా వర్గీయుల ఆగ్రహం
నిరసనగా పెదకూరపాడులో రాజీనామాలు
క్రోసూరు, న్యూస్టుడే: ‘భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన ఆస్తులను పెంచుకోవడానికి పార్టీని వైకాపాకు తాకట్టు పెట్టారు. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వర్గమనే మమ్మల్ని కార్యవర్గ సమావేశాలకూ పిలవడం లేదు’ అని ఆ పార్టీ పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షుడు కె.సైదారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు మంగళవారం క్రోసూరులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సైదారావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జీవో 1 తీసుకొచ్చినా, 10శాతం రిజర్వేషన్లో అగ్రవర్ణాలకు 5శాతమే అమలు చేస్తామన్నా సోము వీర్రాజు ఖండించకపోవటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆయన నిరంకుశ వైఖరివల్ల పార్టీకి చేటు జరుగుతోందని ఆరోపించారు. నియోజకవర్గ బాధ్యుడు గంధం కోటేశ్వరావు మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి కాకుండా డబ్బున్న వాళ్లకు, స్థానికేతరులకు పదవులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కన్నా వర్గమని మాకు ఏ విషయం చెప్పడం లేదని మండిపడ్డారు. వీర్రాజు తప్పుడు నిర్ణయాలను ప్రజలకు, జాతీయ నాయకత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో పార్టీ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నామని ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు పమిడి వెంకట్రామయ్య, 5 మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు