2023 సంవత్సరం.. మార్చి 23వ తేదీ.. 23 ఓట్లు.. అసలు సిసలైన దేవుడి స్క్రిప్ట్: తెదేపా
‘‘23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తెదేపా... 23వ తేదీన విడుదలైన ఫలితాల్లో... 23 స్థానాలకే పరిమితమైంది. దేవుడు ఎంత గొప్పగా స్క్రిప్ట్ రాస్తాడో అనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?’’
పంచుమర్తి అనురాధ గెలుపు
‘‘23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తెదేపా... 23వ తేదీన విడుదలైన ఫలితాల్లో... 23 స్థానాలకే పరిమితమైంది. దేవుడు ఎంత గొప్పగా స్క్రిప్ట్ రాస్తాడో అనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?’’
2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు ఓ ఏడాది పాటు తెదేపాను ఎద్దేవా చేస్తూ ముఖ్యమంత్రి జగన్ పదే పదే చేసిన వ్యాఖ్యలివి.
మరి ఇప్పుడు... అదే దేవుడి స్క్రిప్ట్ రివర్స్ అయ్యింది. 2023వ సంవత్సరం.. మార్చి 23వ తేదీన విడుదలైన ఫలితాల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లు దక్కించుకుని మరీ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తెదేపా 23 ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకుంది. ఆ పార్టీ నుంచి గెలిచిన నలుగురు సభ్యులు.. వైకాపాలో చేరారు. దీంతో తెదేపా బలం 19 స్థానాలకే పరిమితమైంది. అయితే గురువారం విడుదలైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెదేపా అభ్యర్థి అనురాధ 23 ఓట్లు సాధించారు. తెదేపా నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను వైకాపా లాక్కోగా... అదే వైకాపాలో అసంతృప్తిగా ఉన్న వారిలో నలుగురు తెదేపా అభ్యర్థినికి ఓటు వేయటంతో అనురాధ 23 ఓట్లు సాధించగలిగారు. వాస్తవంగా తెదేపా బలం ఎంతో.. ఈ ఎన్నికల్లో అన్నే ఓట్లు వచ్చాయి. అంతే కాదు.. 23.03.2023నే ఆ ఫలితాలు వచ్చాయని తెదేపా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
- ఈనాడు,అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్