Raghu Rama Krishna Raju: కేసీఆర్కు జగన్ ఝలక్!
దిల్లీ మద్యం కుంభకోణంలో కొందరు కీలక వ్యక్తుల పాత్ర గురించి చెప్పడానికే ఆ కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారినట్లు కనిపిస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
వివేకా కేసులో కీలక వ్యక్తి పేరు బయటకు రాకుండా కొత్త ఎత్తులు
అందుకే మద్యం కేసులో అప్రూవర్గా శరత్చంద్రారెడ్డి
ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపణ
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణంలో కొందరు కీలక వ్యక్తుల పాత్ర గురించి చెప్పడానికే ఆ కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారినట్లు కనిపిస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. శరత్చంద్రారెడ్డి మద్యం కేసులో కొందరి పాత్రను వెల్లడిస్తే.. వివేకా కేసులో ఓ కీలక వ్యక్తి పేరు బయటకురాకుండా చూస్తామని కొందరు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయని, దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మోసం చేస్తున్నట్లు అర్థమవుతోందని విశ్లేషించారు. ఆయన గురువారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. ‘‘దిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉన్నట్లుగా సాక్షి పత్రికలో కథనాన్ని రాశారు. ఈ కేసులో కీలక నిందితుడిగా అరెస్ట్ అయి, బెయిల్ పొందిన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. ఆయన జగన్కు అత్యంత సన్నిహితుడు. విజయసాయిరెడ్డి అల్లుడికి అన్న. అలాంటి శరత్ అప్రూవర్గా మారబోతున్నారని రెండు రోజుల క్రితమే పత్రికల్లో వార్త వచ్చింది. అదే నిజమైంది.
అది నిజమైనప్పుడు, శరత్ చంద్రారెడ్డి కొన్ని పేర్లను చెబితే వివేక హత్య కేసులోని కుట్ర కోణం నుంచి కీలక వ్యక్తి పేరు రాకుండా చేస్తామని చెప్పినట్లుగా వచ్చిన వార్తా కథనాలను కూడా నమ్మాల్సి వస్తుంది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను జగన్మోహన్ రెడ్డి మోసగిస్తున్నారని అర్థం అవుతోంది. గత ఎన్నికల్లో మా పార్టీ నెగ్గడానికి కేసీఆర్ ఎంతో సహకరించారని వాదనలు ఉన్నాయి. జగన్ ఆయనకు ద్రోహం చేయడం బాధ కలిగించే అంశం. మద్యం కుంభకోణంలో శరత్ ఎవరెవరి పేర్లను చెబుతారో, దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. అప్రూవర్గా మారే అవకాశం నిందితులకే తప్పితే సాక్షులకు ఉండదు. వివేకా కేసులో నిందితుడైన దస్తగిరి అప్రూవర్గా మారితే సీఎం జగన్, సజ్జల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన్ను జైల్లో పెట్టాలన్నారు. ఇప్పుడు మద్యం కేసులో అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డిని జైల్లో పెట్టాలని ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేస్తే ఆయన్ని అరెస్టు చేస్తారా? చేయరు కదా’’ అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!