Marri Rajasekhar Reddy: మల్కాజిగిరి అభ్యర్థిగా రాజశేఖర్రెడ్డి!
మల్కాజిగిరి భారాస పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జి, మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి మల్కాజిగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.
జనగామలో పల్లా.. నర్సాపూర్లో సునీతా లక్ష్మారెడ్డి?
త్వరలో ప్రకటించనున్న భారాస అధిష్ఠానం
ఈనాడు, హైదరాబాద్: మల్కాజిగిరి భారాస పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జి, మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి మల్కాజిగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఇక్కడి అభ్యర్థిగా ఇప్పటికే మైనంపల్లి హన్మంతరావును ప్రకటించగా.. ఆయన భారాసకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్థానం నుంచి మర్రి రాజశేఖర్రెడ్డిని పోటీలో నిలపాలని భారాస అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈయన మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో భారాస అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ తలపడిన అనుభవం.. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలు రాజశేఖర్రెడ్డికి ఈ ఎన్నికల్లో ఉపయోగపడతాయని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఇప్పటికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం కేసీఆర్ అంతర్గతంగా వారికి సమాచారమివ్వడంతో.. బుధవారం మల్కాజిగిరి నియోజకవర్గంలో భారీ ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఆనంద్బాగ్ నుంచి మల్కాజిగిరి క్రాస్రోడ్డు వరకూ సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. ఉదయం 10 నుంచి 11 గంటల వరకూ ప్రదర్శన.. అనంతరం విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి మల్లారెడ్డి ‘ఈనాడు’తో తెలిపారు.
మరోవైపు జనగామ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి, నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి పేర్లు కూడా ఖరారైనట్లు భారాస వర్గాలు తెలిపాయి. వీరికి కూడా అధిష్ఠానం నుంచి సమాచారం అందడంతో.. స్థానికంగా ప్రచార ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గోషామహల్ స్థానానికి నందకిశోర్, ఆశీష్కుమార్ యాదవ్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిద్దరిలో ఒకరికి సీటు వచ్చే అవకాశాలున్నాయి. ఈ అభ్యర్థుల పేర్లను అధికారికంగా త్వరలోనే ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Assembly Election Results: ఈ ఫలితాలు హస్తం పార్టీకి లాభమా.. నష్టమా..?
2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పక్కాగా గెలుస్తామనుకున్న రెండు రాష్ట్రాల్లో కూడా ఒకటి కోల్పోయింది. మొత్తంగా చూస్తే తెలంగాణలో తొలిసారి అధికారం దక్కించుకోవడమే ఆ పార్టీకి ఊరటగా మిగిలింది. ఇక ఈ ఫలితాలను పార్లమెంట్ ఎన్నికలకు అన్వయించుకొని చూస్తే.. కాంగ్రెస్కు కొంత ఊరట లభించినా.. దిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకోవడానికి ఆ పార్టీ తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. -
భాజపా ఎంపీలకు మిశ్రమ ఫలితాలు
లోక్సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్గా పరిగణించే నాలుగు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సవాల్గా తీసుకున్న భాజపా.. గెలుపు లక్ష్యంగా సర్వశక్తులొడ్డింది. -
దివ్యాంగుల పింఛన్ల మంజూరులో పక్షపాతం: పవన్కల్యాణ్
తమ పక్షం కాని దివ్యాంగులకు పింఛన్ల మంజూరు విషయంలో వైకాపా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. -
20 ఏళ్ల క్రితం ఇలాగే..: జైరాం
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 20 ఏళ్ల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ గుర్తు చేసుకున్నారు. -
రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది
రాష్ట్రాన్ని కాపాడుకునే శక్తిని ప్రసాదించాలని అప్పన్నస్వామిని కోరుకున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. దుష్టశక్తులపై పోరాడే బలాన్ని ఇవ్వాలని ప్రార్థించానన్నారు. -
భాజపాను ప్రజలు ఆశీర్వదించారు: పురందేశ్వరి
కేంద్రంలో భాజపా సుపరిపాలనను మెచ్చి మూడు రాష్ట్రాల్లో ప్రజలు పట్టం కట్టి ‘ఇండియా’ కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
‘గ్యారంటీ’లు అమలు చేయడంతోనే కాంగ్రెస్ విజయం
తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన విజయంలో మా నేతల కృషి, ప్రభుత్వ గ్యారంటీ పథకాల ప్రభావం ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. -
భాజపా విజయం భవిష్యత్తుకు దిక్సూచి
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం భవిష్యత్తు ఫలితాలకు దిక్సూచిగా నిలవనుందని జనసేన అధినేత వపన్కల్యాణ్ పేర్కొన్నారు. -
తెలంగాణలో విజయంపై ఏపీ కాంగ్రెస్ సంబరాలు
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కృషితోనే ఆ రాష్ట్ర ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. -
ఏపీలో జగన్నూ ఓడించాలి: తులసిరెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఆదివారం వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. -
ఆంధ్రాపై తెలంగాణ ఫలితాల ప్రభావం
తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం.. ఆంధ్రాపై తప్పక ప్రభావం చూపుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. -
రాష్ట్రానికి జగన్ వద్దనడానికి సవాలక్ష కారణాలున్నాయి: కన్నా లక్ష్మీనారాయణ
‘‘ఒక్క అవకాశం’ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు కొత్తగా ‘ఏపీ నీడ్స్ జగన్’ అంటూ ప్రజల్లోకి రావడం సిగ్గుచేటు. -
వ్యక్తిగత భద్రతపై పోలీసులు స్పష్టత ఇవ్వాలి
తన వ్యక్తిగత భద్రతపై జిల్లా పోలీసు యంత్రాంగం స్పష్టతనివ్వాలని మాజీ ఎమ్మెల్సీ, వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ బీటెక్ రవి పోలీసులను ప్రశ్నించారు. -
Nara Lokesh: దళితుల్ని ఇబ్బందిపెట్టే వైకాపాను గద్దె దించుదాం
‘‘జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయి. దళితసంఘాలను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనివ్వట్లేదు. -
తెదేపా నేత డూండీ రాకేష్ అరెస్టు.. విడుదల
తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ను విజయవాడ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. -
భాజపా, కాంగ్రెస్లకు శుభాకాంక్షలు తెలిపిన జగన్
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన భాజపాకి, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
Assembly Election Results: ఈ ఫలితాలు హస్తం పార్టీకి లాభమా.. నష్టమా..?
-
Mizoram Election Results: మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్.. ఆధిక్యంలో ప్రతిపక్ష పార్టీ
-
Upcoming Telugu Movies: ఈవారం థియేటర్/ఓటీటీల్లో.. అలరించే సినిమాలు, సిరీస్లివే
-
తూప్రాన్లో కూలిన శిక్షణ హెలికాప్టర్.. ఇద్దరి మృతి?
-
Cyclone Michaung: తుపాను.. గంటకు 14కి.మీ వేగంతో ముందుకు..
-
Stock Market: సూచీల్లో ఎన్నికల ఫలితాల జోష్.. 20,500 పైకి నిఫ్టీ