ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండు పొడిగింపు

కాకినాడలో దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ గడువును రాజమహేంద్రవరం ఎస్సీ,

Published : 24 Sep 2022 05:52 IST

రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్‌టుడే: కాకినాడలో దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ గడువును రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు మరోసారి పొడిగించింది. కేంద్ర కారాగారంలో ఉన్న అనంతబాబుకు గతంలో విధించిన 14 రోజుల రిమాండు పూర్తికావడంతో శుక్రవారం పోలీసులు ఆయన్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం అక్టోబరు 7వరకు న్యాయమూర్తి రిమాండు పొడిగించారు. అనంతబాబును కేంద్ర కారాగారం నుంచి ఉదయం ఎస్కార్ట్‌తో తీసుకువచ్చిన పోలీసులు.. విచారణ అనంతరం కోర్టు వెనుక గేటు నుంచి వాహనంలో జైలుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని